...
...
Next Story

Tungabhadra : తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్లు సిద్ధం - ఈనెల 25న ప్రారంభం, తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక సీఎంల రాక!

Tungabhadra Project Gates : తుంగభద్ర డ్యాంకు రూ. 51 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన స్ప్రిల్‌వే గేట్ల పనులు పూర్తయ్యాయి. జూన్ 25న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త గేట్లను ప్రారంభించనున్నారు.

Published on: Jun 24, 2026, 10:28:35 IST
Advertisement

Tungabhadra Project Gates : తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు సైతం అత్యంత కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టు మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది. ఈ డ్యాంకు కొత్తగా అమర్చిన స్పిల్‌వే గేట్లను జూన్ 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ వేడుకలో కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ కూడా పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల జీవనాడిగా అభివర్ణించిన అధికారిక యంత్రాంగం…. కొత్త గేట్ల ఏర్పాటుతో డ్యాం భద్రత మరింత పటిష్టంగా మారిందని వెల్లడించింది.

33 కొత్త గేట్లు….

తుంగభద్ర డ్యామ్ (ఫైల్ ఫొటొ)
తుంగభద్ర డ్యామ్ (ఫైల్ ఫొటొ)

మొత్తం రూ. 51 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని 33 కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఇంజినీరింగ్ నిపుణులు విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు 73 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ తుంగభద్ర ప్రాజెక్టు మూడు రాష్ట్రాల్లోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తూ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.

2024 ఆగస్టులో వచ్చిన భారీ వరదల సమయంలో డ్యాంకు చెందిన 19వ గేటు కొట్టుకుపోయింది. ఈ ఊహించని ప్రమాదం ప్రాజెక్టు భద్రతతో పాటు నీటి నిర్వహణపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఆ సమయంలో జలాశయం నుంచి నీరు వృథా కాకుండా నిరోధించేందుకు, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలోని నిపుణుల బృందం అత్యవసర చర్యగా స్టాప్-లాక్ గేటును విజయవంతంగా అమర్చింది.

ఈ ప్రమాదం తర్వాత రంగంలోకి దిగిన జాతీయ డ్యాం భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) ప్రాజెక్టు రక్షణను పరిగణనలోకి తీసుకుని, డ్యాంలోని అన్ని స్పిల్‌వే గేట్లను పూర్తిగా మార్చాలని సిఫార్సు చేసింది. ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సంయుక్తంగా శరవేగంతో చర్యలు చేపట్టాయి. నిర్దేశిత కాలపరిమితిలోగా పాత గేట్ల స్థానంలో సరికొత్త గేట్ల అమరికను పూర్తి చేసి….. ఈ కీలకమైన సాగునీటి మౌలిక సదుపాయాన్ని పునరుద్ధరించాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe