పేదల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు సమ ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో మంగళవారం నిర్వహించిన పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 31 ఏళ్ల క్రితం సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశానని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో పాటు ప్రజా చైతన్యం, ప్రజా భాగస్వామ్యం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు.

పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని సీఎం చెప్పారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాలకు పెంచిన పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.73,507 కోట్లను పెన్షన్ల రూపంలో పేదలకు అందించామని చెప్పారు. రెండేళ్లలో సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టి మహిళా సాధికారతకు బాటలు వేశామని చంద్రబాబు అన్నారు. ఏ ఆడబిడ్డా వంట కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో దీపం పథకాన్ని తీసుకొచ్చామని, ఇప్పుడు దీపం-2.0 ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు.
బటన్ నొక్కడం కాదు.. ఇంటింటికీ వచ్చి పెన్షన్ ఇస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఆర్థికంగా వెసులుబాటు కలిగించామని చెప్పారు. గ్రామంలో ఇంకా పేదలు ఉన్నారంటే ఆ గ్రామానికే అవమానమని వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరవు నేలకు కృష్ణా జలాలు అందించామని తెలిపారు. శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవస్వామి పాదాల వరకు నీరు పారించామని చెప్పారు.
గత పాలకులు పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారని సీఎం విమర్శించారు. దీనివల్ల యువత భవిష్యత్తు దెబ్బతిందన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యుత్ సంస్థలను సమర్థంగా నిర్వహిస్తూ తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించామని తెలిపారు. ఆక్వా రైతుకు అండగా నిలిచేందుకు విద్యుత్ యూనిట్ ను రూ.1.5 కే అందిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ మార్కెట్లలో ఇతర దేశాలతో పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తులను తీర్చిదిద్దాలని అన్నారు.
కూటమికి తిరుగులేదు - సీఎం చంద్రబాబు
{{/usCountry}}గత పాలకులు పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారని సీఎం విమర్శించారు. దీనివల్ల యువత భవిష్యత్తు దెబ్బతిందన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యుత్ సంస్థలను సమర్థంగా నిర్వహిస్తూ తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించామని తెలిపారు. ఆక్వా రైతుకు అండగా నిలిచేందుకు విద్యుత్ యూనిట్ ను రూ.1.5 కే అందిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ మార్కెట్లలో ఇతర దేశాలతో పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తులను తీర్చిదిద్దాలని అన్నారు.
కూటమికి తిరుగులేదు - సీఎం చంద్రబాబు
{{/usCountry}}రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమికి తిరుగులేదని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వార్డు సభ్యులు, సర్పంచులు కూడా పాలనలో భాగం కావాలన్నారు. అప్పుడే కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధికి నిధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం అన్నారు. ఓటమి భయంతోనే ఏకగ్రీవాలను వద్దని గొడ్డలి పార్టీ నేతలు చెబుతున్నారని అన్నారు. ఏకగ్రీవాలను ప్రభుత్వాలే ప్రోత్సహించాయని…. మున్సిపాలిటీలు, ఆయారాం- గయారాం అనే పరిస్థితి లేకుండా కార్పోరేషన్లలో చైర్మన్, మేయర్ల ఎన్నికను ప్రత్యక్షం చేశామని అన్నారు. గొడ్డలి పార్టీ నేతలు బీసీ రిజర్వేషన్లను కూడా తగ్గించేశారని సీఎం ఆక్షేపించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరక్కుండా అడ్డుకోవటమే గొడ్డలి పార్టీ ఆలోచన అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని సీఎం స్పష్టం చేశారు.