...
...
Next Story

టీటీడీకి రూ.78 లక్షల విలువైన మందులు విరాళంగా ఇచ్చిన భక్తులు

టీటీడీకి రూ.78 లక్షలు విలువైన ఔషధాలను విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన త్రిశూల్ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ప్రోప్రైటర్స్ చక్రధర్, శివరంజని ఈ ఔషధాలను విరాళంగా అందించారు.

Published on: Jan 1, 2026, 17:07:54 IST
Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు భక్తులు నగదు రూపంలో ఇస్తే మరికొందరు భక్తులు… చెక్కులు, బంగారం, వెండి రూపంలో చెల్లిస్తుంటారు. అయితే హైదరాబాద్ కు చెందిన త్రిశూల్ ఎంటర్ ప్రైజర్స్ సంస్థ అధినేతలు… మరో రూపంలో టీటీడీకి విరాళం అందించారు. రూ.78 లక్షల విలువైన మందులను విరాళంగా ఇచ్చారు.

టీటీడీకి రూ.78 లక్షలు విలువైన ఔషధాలు విరాళం
టీటీడీకి రూ.78 లక్షలు విలువైన ఔషధాలు విరాళం

ఈ మందులను గురువారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు… ఆ సంస్థ అధినేతలు చక్రధర్, శివరంజని అందజేశారు. విరాళంగా ఇచ్చిన మందులను టీటీడీ నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో యాత్రికులు, రోగులకు అందించే వైద్య సేవలకు ఉపయోగిస్తామని టీటీడీ తెలిపింది. ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి‌.కుమార్ పాల్గొన్నారు.

మరోవైపు చెన్నైకు చెందిన పొన్నయ నాగేశ్వరన్ అనే భక్తుడు గురువారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకి అందించారు.

విశేష పర్వదినాలు:

ఇక జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలను కూడా టీటీడీ ప్రకటించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి….

• జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం.

• జనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర.

• జనవరి 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.

• జనవరి 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.

• జనవరి 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.

• జనవరి 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.

• జనవరి 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.

• జనవరి 23న వసంత పంచమి.

• జనవరి 25న రథ సప్తమి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe