...
...
Next Story

ఆంధ్రప్రదేశ్‌లో చేపల వేటపై డీజిల్ కొరత ఎఫెక్ట్.. ఇంటి వద్దే ఉంటున్న మత్స్యకారులు

మత్స్యకారులకు డీజిల్ కొరత కారణంగా కొన్ని రోజులుగా చేపల వేటకు వెళ్లడం లేదు. ఇలాగే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే.. తమ బతుకులు అధ్వానంగా తయారవుతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published on: Mar 25, 2026, 15:08:26 IST
By , Visakhapatnam
Prefer HTon Google
Advertisement

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారతదేశంపై కూడా పడుతోంది. ఇప్పటికే ఎల్పీజీ కొరత ప్రచారంతో జనాలు పెద్ద ఎత్తున గ్యాస్ నిల్వల కోసం ప్రయత్నాలు చేశారు. తాజాగా పెట్రోల్, డీజిల్ దొరకదని ప్రచారం జరుగుతుండటంతో పెట్రోల్ బంకుల వద్దకు భారీగా తరలివెళ్తున్నారు. మరోవైపు మత్స్యకారులకు డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 రోజులు చేపల వేటకు వెళ్లడం లేదు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ మాట్లాడుతూ.. డీజిల్ కొరత కారణంగా పడవలు నిలిచిపోవడంతో గత 10 రోజులుగా చేపల వేట కార్యకలాపాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ పరిస్థితికి ప్రపంచ పరిణామాలు పాక్షికంగా కారణమని, దీంతో మత్స్యకారులకు పని లేకుండా పోయిందని అన్నారు.

ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ అసోసియేషన్ జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించినప్పటికీ.. సమస్య పరిష్కారం కాలేదని జానకిరామ్ పేర్కొన్నారు. మత్స్య సహకార సంఘం కూడా తగినంత మద్దతు ఇవ్వలేదని తెలిపారు. కాలుష్యం కారణంగా చేపల లభ్యత ఇప్పటికే తగ్గిపోయిందని, మరికొన్ని రోజుల్లో వేట నిషేధ కాలం వేగంగా సమీపిస్తోందన్నారు. రాయితీతో కూడిన డీజిల్ సకాలంలో సరఫరా కాకపోతే.. మత్స్యకారులు మరింత ఇబ్బందులు పడవచ్చు.

కేంద్ర ప్రభుత్వం మత్స్య రంగాన్ని పారిశ్రామిక వర్గం కింద చేర్చడం వల్ల మత్స్య రేవుల్లో డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ. 24 మేర పెరిగాయని జానకిరామ్ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి ఉపశమనం ఏదీ కల్పించలేదని ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, మత్స్యకారుల కోసం డీజిల్ ధరలను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.

సబ్సిడీ డీజిల్ సకాలంలో అందకపోతే.. మత్స్యకారుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని జానకిరామ్ చెప్పారు. స్థానిక మత్స్యకారుల నుంచి ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా హార్బర్లను ప్రైవేటీకరించడం సమంజసం కాదని పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe