వరల్డ్ ఎలిఫెంట్ డే(ఆగస్టు 12) పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారం (ఆగస్టు 9, 2026) రోజున విద్యార్థుల కోసం చిత్రలేఖనం (డ్రాయింగ్) పోటీలను నిర్వహించనున్నట్లు జూ అధికారులు వెల్లడించారు.

జూపార్క్ ప్రాంగణంలోని జూ బయోస్కోప్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పోటీలు జరగనున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ, ఏనుగుల విశిష్టతపై అవగాహన పెంచేందుకు ఈ పోటీలను మొత్తం మూడు విభాగాలుగా వర్గీకరించారు.
విభాగం-1 (1 నుంచి 5వ తరగతి విద్యార్థులు) ‘నా ఏనుగు - దాని సంరక్షకుడు’ (My Elephant and Its Keeper)
విభాగం-2 (6 నుంచి 10వ తరగతి విద్యార్థులు) ‘ఏనుగు: ఇండియా నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ - వన్యప్రాణుల రక్షణ, వారసత్వ పరిరక్షణ’
విభాగం-3 (ఇంటర్మీడియట్ నుంచి పీజీ విద్యార్థులు) ‘మానవ-ఏనుగుల స్నేహం: సవాళ్లు, ఆవిష్కరణలు, శాశ్వత పరిష్కారాలు’
పోటీలో పాల్గొనే అభ్యర్థులకు డ్రాయింగ్ షీట్లను జూ యాజమాన్యమే ఉచితంగా అందిస్తుంది. పాల్గొనే విద్యార్థులు తమకు కావలసిన కలర్స్, పెన్సిళ్లు, ప్యాడ్లు మొదలైన ఇతర డ్రాయింగ్ మెటీరియల్ను స్వయంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ జూపార్క్ తరఫున సర్టిఫికేట్లు అందజేస్తారు.
ఈ పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాలు, నిబంధనల కోసం జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్ను నేరుగా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం 7893632900ను సంప్రదించవచ్చు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఇక్కడ దాదాపు 80కి పైగా జాతులకు చెందిన 800లకు పైగా జంతువులు, పక్షులు, సరీసృపాలు ఉన్నాయి. బెంగాల్ టైగర్, ఆసియా సింహాలు, చిరుతపులులు, ఆఫ్రికన్ ఏనుగులు, హిప్పోపోటమస్, జింకలు, అడవి దున్నలు చూడొచ్చు. నెమళ్ళు, రంగురంగుల చిలుకలు, నిప్పుకోళ్ళు ఉన్నాయి.
జూ బయోస్కోప్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్లో విద్యార్థులు, పర్యాటకులకు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణంపై అవగాహన కలిగించేందుకు ప్రత్యేక తరగతులు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. జూ చాలా పెద్దది కావడంతో నడవలేని వారి కోసం బ్యాటరీతో నడిచే వాహనాలు అందుబాటులో ఉంటాయి. రంగురంగుల సీతాకోకచిలుకల పార్కుతో పాటు పక్షులను దగ్గరగా చూడటానికి వాక్-త్రూ అవేరీ సదుపాయం ఉంది. జంతువుల పోషణ, సంరక్షణలో భాగస్వాములు కావడానికి సాధారణ పౌరులు, సంస్థలకు జంతువులను దత్తత తీసుకునే అవకాశం ఉంది.
{{/usCountry}}జూ బయోస్కోప్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్లో విద్యార్థులు, పర్యాటకులకు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణంపై అవగాహన కలిగించేందుకు ప్రత్యేక తరగతులు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. జూ చాలా పెద్దది కావడంతో నడవలేని వారి కోసం బ్యాటరీతో నడిచే వాహనాలు అందుబాటులో ఉంటాయి. రంగురంగుల సీతాకోకచిలుకల పార్కుతో పాటు పక్షులను దగ్గరగా చూడటానికి వాక్-త్రూ అవేరీ సదుపాయం ఉంది. జంతువుల పోషణ, సంరక్షణలో భాగస్వాములు కావడానికి సాధారణ పౌరులు, సంస్థలకు జంతువులను దత్తత తీసుకునే అవకాశం ఉంది.
{{/usCountry}}