...
...
Next Story

కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు - పలు రైళ్ల సమయాల్లో మార్పులు! లిస్ట్ ఇదే

విజయవాడ డివిజన్ పరిధిలోని కొవ్వూరు స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలను దక్షిణ మధ్య రైల్వే రీషెడ్యూల్ చేసింది.

Published on: Sep 11, 2026, 14:10:55 IST
Advertisement

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ ప్రమాదం కారణంగా ఇవాళ నడిచే పలు కీలక ఎక్స్‌ప్రెస్ రైళ్ల బయలుదేరే సమయాలను సవరించినట్లు (రీషెడ్యూల్) దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. పట్టాలపై పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నందున…. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ట్రైన్స్ రీషెడ్యూల్…

  • కాకినాడ టౌన్ – మైసూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు 17289) : 11.09.2026న బయలుదేరాల్సిన ఈ రైలు 300 నిమిషాలు (5 గంటలు) ఆలస్యంగా నడవనుంది. ఇది మధ్యాహ్నం 14:00 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరుతుంది.
  • విశాఖపట్నం - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు 20708) : 120 నిమిషాలు (2 గంటలు) ఆలస్యంగా… అంటే ఇవాళ సాయంత్రం 16:30 గంటలకు విశాఖపట్నం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
  • కాకినాడ పోర్ట్ – లింగంపల్లి గౌతమి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు 12737) : 120 నిమిషాలు (2 గంటలు) రీషెడ్యూల్ చేశారు. ఈ రైలు రాత్రి 21:15 గంటలకు కాకినాడ పోర్ట్ నుంచి బయలుదేరుతుంది.
  • విశాఖపట్నం – చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు 18527): 120 నిమిషాలు (2 గంటలు) ఆలస్యంగా, రాత్రి 19:30 గంటలకు విశాఖపట్నం నుంచి ప్రయాణం కానుంది.

కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బొగీలను తొలగించి, ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు రైల్వే ఇంజనీర్లు, సిబ్బంది ఘటనా స్థలంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైళ్ల సమయాల్లో మార్పులు జరిగినందున ప్రయాణికులు గమనించి… తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

కొవ్వూరు వద్ద ఏం జరిగిందంటే..?

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో నాలుగో లైన్‌పై గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం ఉదయం ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు 8 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks