...
...
Next Story

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు - రేపు పోలవరం ఎడమ కాలువ ప్రారంభం..! ప్రాజెక్ట్ వివరాలు

పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను సీఎం చంద్రబాబు రేపు విడుదల చేయనున్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందనుంది.

Published on: Sep 1, 2026, 16:09:27 IST
Advertisement

ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ మైన్ కెనాల్ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (బుధవారం) విడుదల చేయనున్నారు. పాయకరావుపేట వద్ద నిర్మించిన రెగ్యులేటర్‌ను ఆన్ చేసి….. గోదావరి తల్లికి 'జల హారతి' ఇచ్చి స్వాగతం పలకనున్నారు.

సాగు, తాగు నీరు….

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు

ఈ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదలతో ఉత్తరాంధ్రలోని నాలుగు ప్రధాన జిల్లాల్లో ప్రయోజనం చేకూరనుంది. వివిధ ఆయకట్టుల పరిధిలో మొత్తం 2,87,320 ఎకరాలకు నిలకడైన సాగునీరు అందడమే కాకుండా, దాదాపు 5.23 లక్షల మంది జనాభాకు తాగునీటి ఎద్దడి తీరుతుంది. పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ నీరు ఎంతో దోహదపడనుంది.

పోలవరం లెఫ్ట్ మైన్ కెనాల్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 4,192 కోట్లు వ్యయం చేసింది. ఈ కాలువ నిర్మాణం ఏమాత్రం సాధారణమైనది కాదు. తూర్పు కనుమలను తొలిచి, అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, కొండలు, లోయలను అధిగమిస్తూ ఇంజనీర్లు ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.

ఈ మార్గంలో ఉన్న ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి అనేక స్థానిక నదులను దాటుకుంటూ గోదావరి జలాలు ప్రవహిస్తాయి. నదుల ప్రవాహానికి అడ్డులేకుండా కాలువను తరలించేందుకు అనేక చోట్ల సైఫన్లు, అక్విడెక్టులను నిర్మించారు.

  • ఏలేరు నది వద్ద సైఫన్ : ఏలేరు నది బెడ్ లెవెల్ కంటే దిగువ నుంచి గోదావరి జలాలను తరలించేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక సైఫన్ నిర్మించింది.
  • పంపా నదిపై అక్విడెక్ట్ : పంపా నది ఎగువ భాగం నుంచి కాలువ వెళ్లేలా 30 మీటర్ల లోతు వరకు తవ్వి, 312 పైల్స్‌తో బలమైన పునాదులు వేసి అక్విడెక్ట్ నిర్మించారు.
  • తాండవ నదిపై అక్విడెక్ట్ : సుమారు 10,634 క్యూసెక్కుల ఉధృత ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా 6 వెంట్లతో 447 మీటర్ల పొడవున భారీ అక్విడెక్ట్ నిర్మించి ఇంజనీరింగ్ ప్రతిభను చాటారు.
  • దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాళ్లపాలెం భూ వివాదాన్ని సమర్థవంతంగా పరిష్కరించి, నిర్వాసితులైన 472 కుటుంబాలకు పునరావాసం కల్పించారు.

ఏలేరు ఆయకట్టు కింద 80,700 ఎకరాలు, పంపా పరిధిలో 12,000 ఎకరాలు, తాండవ, వరాహ, మామిడిగెడ్డ పరిధిలో 46,620 ఎకరాలకు సాగునీటి భద్రత లభిస్తుంది. మొత్తంగా 23.44 టీఎంసీల గోదావరి జలాలను తరలించి సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.

మొత్తంగా 213 కిలోమీటర్ల నిడివితో నిర్మించిన ఈ ఎడమ కాలువ ద్వారా భవిష్యత్తులో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అంతేకాకుండా, ఈ ఎడమ కాలువను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు అనుసంధానించేలా రాష్ట్ర కూటమి ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు నిరూపించింది. ఈ అనుసంధానం పూర్తయితే అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకు ఉచితంగా గోదావరి నీరు పారుతుంది. తద్వారా మొత్తం ఉత్తరాంధ్రవ్యాప్తంగా 8 లక్షల ఎకరాలకు శాశ్వత సాగు, తాగునీటి సమస్య తీరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe