...
...
Next Story

చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. వైజాగ్ వీధుల్లో రూ.1,425 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ జోన్లు!

విశాఖపట్నంలో వీధి వ్యాపారులకు శుభవార్త. మూడు కీలక ప్రదేశాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Published on: Dec 25, 2025, 07:50:48 IST
Advertisement

విశాఖపట్నంలో వీధి విక్రయాలను ఆధునీకరించడానికి రూ.1,425 కోట్ల ప్రాజెక్టు మూడు కీలక ప్రదేశాలలో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటుతో ప్రారంభం కానుంది. అవి మధురవాడలోని ఆర్ఆర్ సెంటర్ (70 యూనిట్లు), గాజువాకలోని కూర్మన్నపాలెం వద్ద దువ్వాడ ఫ్లైఓవర్ కింద (70 యూనిట్లు), సూర్యబాగ్ సెంట్రల్ పార్క్ (110 యూనిట్లు).

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) పట్టణ మౌలిక సదుపాయాలు, నగర సౌందర్యాన్ని పెంపొందించడంతో పాటు వీధి వ్యాపారుల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి.. జోనల్ కమిషనర్ల సమన్వయంతో జీవీఎంసీ జోన్-IV కార్యాలయం, ఇతర జోనల్ కార్యాలయాలలో లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించారు.

ఆపరేషన్ LUNGS 2.0 కింద ట్రాఫిక్ సజావుగా సాగడానికి, పాదచారుల భద్రతకు, నగర సుందరీకరణకు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, జంక్షన్‌లపై ఉన్న స్టాళ్లు, దుకాణాలు వంటి ఆక్రమణలను తొలగించినట్లు సత్యవేణి చెప్పారు. అయితే ఇందులో భాగంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ చొరవ ఆధునిక సౌకర్యాలతో వెండింగ్ జోన్‌లను ఏర్పాటు చేయనున్నట్టుగా వెల్లడించారు. విక్రేత సంక్షేమానికి, వారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ వెండింగ్ ప్రాజెక్ట్ ఉపయోగపడనుంది.

వీధి వ్యాపారులకు స్థిరమైన జీవనోపాధిని అందించడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ లక్ష్యం. జోన్-IV, గాజువాకలో జరిగిన సమావేశాలలో జోనల్ కమిషనర్లు, వీధి విక్రయ కమిటీలు, లబ్ధిదారులు సమావేశమయ్యారు. వారు తమ సమ్మతిని తెలిపారు. దరఖాస్తు ఫారమ్‌లను విక్రేతలకు సమర్పించడానికి జారీ చేస్తారు.

1,425 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు జీవీఎంసీ, MEPMA, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిధులు సమకూరుస్తాయి. ప్రతి లబ్ధిదారుడు ప్రత్యక్షంగా లేదా బ్యాంకు రుణాల ద్వారా రూ.2.5 లక్షలు అందిస్తారు. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్లలో మాడ్యులర్ కియోస్క్‌లు, సౌరశక్తితో పనిచేసే లైటింగ్, డిజిటల్ చెల్లింపు సౌకర్యాలు, వ్యర్థాల సేకరణ, పారిశుద్ధ్య సేవలు, సీటింగ్ ప్రాంతాలు, సీసీటీవీ నిఘా, నైపుణ్య అభివృద్ధి మద్దతు, FSSAI ధృవీకరణ ఉంటాయి.

ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ చొరవను స్వాగతించారు. అందుబాటులో ఉన్న యూనిట్లను మించి దరఖాస్తులు వస్తే లాటరీ విధానాన్ని అనుసరిస్తామని హామీ ఇచ్చారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe