రూ. 2,816 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కొత్త మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా లభించిందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుండి గుంటూరు జిల్లాలోని రేపల్లె వరకు విస్తరించి ఉన్న ఈ 47.60 కిలోమీటర్ల కొత్త బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు త్వరలో లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బాలశౌరి తెలిపారు. తుది స్థల సర్వే పూర్తయిందని, రైల్వే బోర్డు ఆమోదంతో వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశామన్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు రైల్వే స్టేషన్లు, 70 వంతెనలు, 24 రైల్వే అండర్ బ్రిడ్జిలను ఆధునిక విద్యుదీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థలతో నిర్మిస్తారని ఎంపీ తెలిపారు.
'తుది స్థల సర్వే పూర్తయింది. రైల్వే బోర్డు ఆమోదంతో వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశాం. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు రైల్వే స్టేషన్లు, 70 వంతెనలు, 24 రైల్వే అండర్ బ్రిడ్జిలను ఆధునిక విద్యుదీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థలతో నిర్మిస్తారు.' అని మచిలీపట్నం ఎంపీ తెలిపారు.
తిరుపతి-ఓఖా
తిరుపతి నుంచి గుజరాత్లోని ద్వారకా సమీపంలో ఉన్న ఓఖా వరకు కొత్తగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది రైల్వే. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ... తిరుపతి-ఓఖా-తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్(రైలు నంబర్లు 19559/19560) రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.
రైలు నంబరు 19559 (తిరుపతి - ఓఖా): ఈ రైలు ప్రతి గురువారం తిరుపతిలో బయలుదేరుతుంది. మే 14, 2026 నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
{{/usCountry}}రైలు నంబరు 19559 (తిరుపతి - ఓఖా): ఈ రైలు ప్రతి గురువారం తిరుపతిలో బయలుదేరుతుంది. మే 14, 2026 నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
{{/usCountry}}రైలు నంబరు 19560 (ఓఖా - తిరుపతి): ఈ రైలు ప్రతి సోమవారం ఓఖాలో బయలుదేరుతుంది. మే 11, 2026 నుంచే ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
తిరుపతిలో గురువారం ఉదయం 08:15 గంటలకు బయలుదేరి…. శనివారం ఉదయం 11:50 గంటలకు ఓఖా చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఓఖాలో సోమవారం రాత్రి 23:55 గంటలకు బయలుదేరి, బుధవారం రాత్రి 23:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
ఈ వీక్లీ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల్లోని బాసర, నిజామాబాద్, కామారెడ్డి, బొల్లారం, కాచిగూడ, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, ఢోన్, తాడిపత్రి, కడప, రాజంపేట్, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో 1 సెకండ్ ఏసీ కోచ్, 3 థర్డ్ ఏసీ బోగీలు, 10 స్లీపర్ బోగీలు, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.