ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డులో ఎండు మిర్చి ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన డిమాండ్ ఉండటం, గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సీజన్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గడం దీనికి కారణంగా కనిపిస్తుంది.
ప్రీమియం రకాల ధరలు

మిర్చి యార్డు అధికారుల ప్రకారం.. ప్రీమియం రకాల ధరలు గత సంవత్సరం కంటే 20 నుండి 25 శాతం పెరిగాయి. ప్రస్తుతం దేవ్నూర్ డీలక్స్ (డిడి) రకం క్వింటాలుకు రూ.25,000 వరకు లభిస్తుండగా, బ్యాడిగి రకం క్వింటాలుకు రూ.23,000 వరకు అమ్ముడవుతోంది.
341 రకం మిర్చి క్వింటాలుకు రూ.22,500కు చేరుకుంది. తేజా రకం క్వింటాలుకు రూ.20,500కు వచ్చింది. తాలు రకం క్వింటాలుకు రూ.11,000కు అమ్ముడవుతోంది. మార్కెట్ డిమాండ్ను బట్టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులు మెరుగైన ధరలను పొందడానికి తమ మిర్చి నిల్వలను గుంటూరు మిర్చి యార్డుకు పెద్ద మెుత్తంలో తీసుకువస్తున్నారు. డిమాండ్ను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యాపారులు సింగపూర్, బంగ్లాదేశ్, చైనా, థాయిలాండ్, అరబ్ దేశాలతో సహా అంతర్జాతీయ మార్కెట్లకు అధిక నాణ్యత గల తేజా, 341, 334 రకాలను ఎగుమతి చేస్తున్నారు. పెరిగిన ఎగుమతులు ధరలను మరింత పెంచుతాయని, రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని చెబుతున్నారు.
దిగుబడి తగ్గి..
సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడి తగ్గడం వల్ల ధరలు భారీగా పెరిగాయని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు అంటున్నారు. 2024, 2025లో రైతులు భారీ నష్టాలను చవిచూసిన నేపథ్యంలో ఎండు మిర్చి సాగు విస్తీర్ణం గత సంవత్సరం 1.96 లక్షల హెక్టార్ల నుండి ఈ సీజన్లో 1.06 లక్షల హెక్టార్లకు గణనీయంగా తగ్గింది. దీంతో ఈ సీజన్లో ఉత్పత్తి 5.39 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు.
రైతులకు సౌకర్యాలు
ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డుకు రోజుకు సుమారు 70 వేల బస్తాలు వరకు వస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇక పీక్ సీజన్లో రోజుకు లక్ష బస్తాలకు చేరుకుంటుందని అంచనా. యార్డు అధికారులు రైతులకు తాగునీరు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇక పసుపు రకం మిర్చి క్వింటా రూ.44వేలు ఇటీవల పలికింది. అంతర్జాతీయ మారెట్లో పసుపు మిర్చికి ఎకువగా డిమాండ్ ఉంటుంది.
{{/usCountry}}ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డుకు రోజుకు సుమారు 70 వేల బస్తాలు వరకు వస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇక పీక్ సీజన్లో రోజుకు లక్ష బస్తాలకు చేరుకుంటుందని అంచనా. యార్డు అధికారులు రైతులకు తాగునీరు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇక పసుపు రకం మిర్చి క్వింటా రూ.44వేలు ఇటీవల పలికింది. అంతర్జాతీయ మారెట్లో పసుపు మిర్చికి ఎకువగా డిమాండ్ ఉంటుంది.
{{/usCountry}}