...
...
Next Story

IMD Rain Alert : ఏపీకి తీవ్రవాయుగుండం ముప్పు - భారీ వర్షాలు కురిసే అవకాశం!

Andhrapradesh Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడనున్న తీవ్రవాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగిరావాలని…. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Published on: Sep 19, 2026, 14:55:11 IST
Advertisement

Andhrapradesh Weather Updates : ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో మళ్లీ ఉపరితల ఆవర్తనం తీవ్రరూపం దాల్చుతోంది. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో శనివారం సాయంత్రానికి ఒక అల్పపీడనం ఏర్పడనుందని…. ఇది సోమవారానికి వాయుగుండంగా బలపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఏపీ వెదర్ రిపోర్ట్
ఏపీ వెదర్ రిపోర్ట్

అల్పపీడన వ్యవస్థ క్రమంగా తీవ్రమై మంగళవారం నాటికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల సమీపానికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకునే సూచనలున్నాయి.

కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు……

ఈ తీవ్రవాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర సహా కోస్తాంధ్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే ముప్పు ఉనందున అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉన్నందున…. ఆయా ప్రాంతాల ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేసింది.

సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక….

తీరం వెంట గంటకు తీవ్ర వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తమ పడవలతో తీరానికి తిరిగి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సముద్ర తీర ప్రాంత అధికారులను, వేటగాళ్లను ఆదేశించారు.

అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు….

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks