Andhrapradesh Weather Updates : బంగాళాఖాతంలో వాతావరణం మారుతోంది. వాయవ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ‘స్పష్టమైన అల్పపీడనం’గా రూపాంతరం చెందిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఇది మరిన్ని గంటల్లో మరింత తీవ్రమై… బలమైన వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
తీరప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు

ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంట పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. రాగల మంగళవారం వరకు తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే వీలుంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున, మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు, సముద్రం వైపు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవాళ(ఆగస్ట్ 17, 2026) శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం ప్రాంతంతో పాటు విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా పలుచోట్ల తేలికపాటి జల్లుల నుండి వర్షం పడొచ్చు.
ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ముప్పు ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో సురక్షితమైన ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని…. అత్యవసర సేవలకు స్థానిక యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
{{/usCountry}}ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ముప్పు ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో సురక్షితమైన ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని…. అత్యవసర సేవలకు స్థానిక యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
{{/usCountry}}