Tirupati Special Trains : సెప్టెంబర్ 20న తిరుపతి-విజయవాడ మధ్య స్పెషల్ ట్రైన్స్
Tirupati Special Trains : ప్రయాణికుల రద్దీ కారణంగా తిరుపతి-విజయవాడ మధ్య సెప్టెంబర్ 20వ తేదీన ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ట్రైన్స్ ఎక్కడ ఆగుతాయో చూడండి.
ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి-విజయవాడ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 20న(ఆదివారం) ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, గరుడ సేవ వేళ తిరుమల సందర్శించే భక్తులతో పాటు, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

తిరుపతి – విజయవాడ ప్రత్యేక రైలు (రైలు నం. 07606) సెప్టెంబర్ 20న తెల్లవారుజామున 1:15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. అదే రోజు ఉదయం 8:00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
విజయవాడ – తిరుపతి ప్రత్యేక రైలు (రైలు నం. 07605) సెప్టెంబర్ 20న ఉదయం 9:00 గంటలకు విజయవాడ నుండి బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 4:45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
ఈ ట్రైన్లు రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి జంక్షన్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. 16 - జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, 04 - స్లీపర్ క్లాస్ కోచ్లు, 02 - ఎస్ఎల్ఆర్ కోచ్లు ఉంటాయి. తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్లే భక్తులు, వీకెండ్ ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకుని తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ప్రయాగ్రాజ్ - తిరునెల్వేలి స్పెషల్ ట్రైన్స్ వయా ఏపీ
రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని అనుసంధానిస్తూ ప్రయాగ్రాజ్-తిరునెల్వేలి-ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా 4 ట్రిప్పుల చొప్పున ఈ రైళ్లు సర్వీసులను అందించనున్నాయి.
ప్రయాగ్రాజ్-తిరునెల్వేలి ప్రత్యేక రైలు(రైలు నంబరు: 04171) 19.09.2026 నుండి 10.10.2026 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. మెుత్తం 4 ట్రిప్పులు నడవనున్నాయి.
తిరునెల్వేలి – ప్రయాగ్రాజ్ ప్రత్యేక రైలు (రైలు నంబరు: 04172) 21.09.2026 నుండి 12.10.2026 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది. ఇది కూడా 4 ట్రిప్పులు ప్లాన్ చేశారు.
ఈ ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోని పలు కీలక స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఏపీలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో ఆగుతుంది. ఇతర ముఖ్యమైన స్టేషన్లు చూసుకుంటే.. మాణికపూర్, సత్నా, కట్ని, జబల్పూర్, ఇటార్సి, నాగ్పూర్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, మదురై, ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


