...
...
Next Story

సింగిల్ డేలోనే వైజాగ్ టు అరకు టూర్ - ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ, ధర ఎంతంటే?

విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ఒక రోజు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ప్యాకేజీ పూర్తి వివరాలు, ప్రయాణ మార్గం, టికెట్ ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి

Published on: Jul 6, 2026, 09:42:05 IST
Advertisement

ప్రకృతి ప్రేమికులకు, వారాంతాల్లో సరదాగా గడపాలనుకునే పర్యాటకులకు సరికొత్త ప్రయాణ అనుభూతులను అందించేందుకు IRCTC టూరిజం సిద్ధమైంది. పచ్చని కొండల పకృతి రమణీయతకు నిలయమైన అరకు వ్యాలీని సందర్శించడానికి 'విశాఖపట్నం-అరకు-విశాఖపట్నం' (రైల్ కమ్ రోడ్) పేరిట ఒక రోజు (01 Day) ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ప్రతిరోజూ అందుబాటులో ఉండే ఈ టూర్ ప్యాకేజీ ద్వారా పర్యాటకులు ఎంతో సౌకర్యవంతంగా అరకు అందాలను చూసి రావొచ్చు.

  • షెడ్యూల్ ప్రకారం…. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 07:00 గంటలకు రైలు నంబర్ 58501 ద్వారా ప్రారంభమవుతుంది.
  • రైలు ప్రయాణంలో దారిపొడవునా వచ్చే అందమైన కొండలు, లోయలు, అనేక సొరంగాలు (Tunnels) మరియు వంతెనల గుండా ప్రయాణిస్తూ ఉదయం 11:00 గంటలకు అరకు స్టేషన్ చేరుకుంటారు. అ
  • క్కడి నుంచి ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక నాన్-ఏసీ వాహనంలో స్థానిక పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుంది.
  • ఈ టూర్‌లో భాగంగా అరకులోని ప్రసిద్ధ గిరిజన మ్యూజియం, పద్మాపురం బొటానికల్ గార్డెన్ చూస్తారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం ముగించుకుని, తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్ మరియు అద్భుతమైన బొర్రా గుహలను (Borra Caves) సందర్శిస్తారు. రాత్రికి తిరిగి వైజాగ్ చేరుకోవడంతో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
  • పర్యాటకుల సౌకర్యార్థం ఈ ప్యాకేజీని రెండు విభాగాలుగా (Comfort - EV, Standard - SL) వర్గీకరించారు. మీరు ఎంచుకునే సీటింగ్, ప్రయాణికుల సంఖ్యను బట్టి ధరలు మారుతుంటాయి

టికెట్ ధరలు…

అరకు వ్యాలీ
అరకు వ్యాలీ

కంఫర్ట్ క్లాస్ (Comfort - EV విస్టాడోమ్ కోచ్) లో ఒక్కరే ప్రయాణిస్తే రూ. 6,545, ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 4,055, ముగ్గురు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 3,225, నలుగురు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 2,810గా ఉంటుంది.

స్టాండర్డ్ క్లాస్ (Standard - SL స్లీపర్ కోచ్)లో అయితే ఒక్కరే ప్రయాణిస్తే (Single Occupancy) రూ. 5,650, ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 3,160, ముగ్గురు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 2,330, నలుగురు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 1,915గా నిర్ణయించారు.

ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునే వారు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ (www.irctctourism.com) ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ టికెట్ రద్దు చేసుకోవాల్సి వస్తే ఆన్‌లైన్ ద్వారానే రద్దు చేసుకోవాలి, పీఆర్‌ఎస్ కౌంటర్లలో ఇది సాధ్యం కాదు. ప్రయాణ తేదీకి 15 రోజుల ముందు రద్దు చేసుకుంటే ఒక ప్రయాణికుడికి రూ. 250 చొప్పున కట్ అవుతుంది. 8 నుంచి 14 రోజుల ముందు అయితే ప్యాకేజీ ధరలో 25 శాతం, 4 నుంచి 7 రోజుల ముందు అయితే 50 శాతం నిధులు కోత విధిస్తారు. ప్రయాణానికి 4 రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రీఫండ్ లభించదు. ఏవైనా సందేహాలుంటే వైజాగ్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వద్ద ఉన్న ఐఆర్‌సీటీసీ కార్యాలయాన్ని లేదా 9550166168, 9281495847 నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe