అందమైన ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన అరకును చూడాలనుకుంటున్నారా..? అయితే మీకోసమ విశాఖపట్నం నుంచి ఓ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి రానుంది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం సిద్దమైంది.

IRCTC టూరిజం…. ‘విశాఖపట్నం - అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ 12 డిసెంబర్, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.
టూర్ షెడ్యూల్ వివరాలు:
- డే 1 : టికెట్లు బుకింగ్ చేసుకున్న టూరిస్టులను విశాఖలోని ఓ హోటల్ కు తీసుకెళ్తారు. ఇక్కడ ఫ్రెషప్ అయిన తర్వాత… లంచ్ ఉంటుంది. అక్కడ్నుంచి తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్ కు వెళ్తారు. సాయంత్రం హోటల్ కు చేరుకుంటారు. డిన్నర్ తర్వాత విశాఖలోనే బస చేస్తారు.
- డే 2: బ్రేక్ ఫాస్ట్ తర్వాత అరకు(ఉదయం 8 వరకు)కు చేరుకుంటారు. ఇక్కడ పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లానిటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి విశాఖకు చేరుకుంటారు.
- డే 3: బ్రేక్ ఫాస్ట్ తర్వాత విశాఖలో సబ్ మెరైన్ మ్యూజియం చేస్తారు. ఈ మ్యూజియం సోమవారం తెరిచి ఉండదు.ఆ తర్వాత రామానాయుడు స్టూడియోను కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలు:
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 20035, డబుల్ అక్యుపెన్సీకి రూ. 10860,ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 8450గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ధరలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలుంటే 8287932318, 9281495847, 9550166168 నెంబర్లను సంప్రదించవచ్చు.