పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవాన్ని లెక్కలోకి తీసుకుని పదవులు ఇచ్చినట్టుగా అధిష్టానం వెల్లడించింది. పనిచేసేవారికే పార్టీలో పెద్దపీట అన్న సంకేతాన్ని ఇచ్చింది. మంత్రి నారా లోకేష్కు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్పారు.

మంత్రి నారా లోకేష్ను టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. తనదైన వ్యూహాలతో క్యాడర్లో ఉత్సాహం నింపుతున్న లోకేష్కు ఈ బాధ్యత అప్పగించడం ద్వారా పార్టీ భవిష్యత్తు బాగుంటుందని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు మరోసారి నియమితులయ్యారు. సీనియర్లకు గౌరవం, కొత్తవారికి అవకాశాలు, సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగినట్టు తెలుస్తోంది.
29 మందితో పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ అయిన పొలిట్ బ్యూరో నియామకాలు జరిగాయి. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్లకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
- 31 మందితో కూడిన జాతీయ కమిటీలో ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు కాగా 18 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 10 మందిని జాతీయ అధికార ప్రతినిధులుగా నియమించింది టీడీపీ.
- రాష్ట్ర కమిటీలో 185 మంది ఉండగా వీరిలో 7గురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, 16 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు, 14 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు, 10 మంది రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్లు, 59 మంది రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు, 77 మంది రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు. నాలెడ్జి కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొక్కరిని నియమించారు.
- టీడీపీ రాష్ట్ర కమిటీలోని 185 మందికి గానూ 50 మంది మహిళలకు చోటు కల్పించింది. అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించింది.
- 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది (బీసీ-77, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13) బడుగులకు చంద్రబాబు చోటు కల్పించారు.
పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియామకాలు జరిగాయని టీడీపీ పేర్కొంది. అలాగే నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం జరిగిందని పేర్కొంది. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్ద పీట వేశామని టీడీపీ అధిష్ఠానం స్పష్టం చేసింది.
{{/usCountry}}పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియామకాలు జరిగాయని టీడీపీ పేర్కొంది. అలాగే నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం జరిగిందని పేర్కొంది. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్ద పీట వేశామని టీడీపీ అధిష్ఠానం స్పష్టం చేసింది.
{{/usCountry}}