ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక అమరావతే ఏకైక రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎవరూ అంగుళం కూడా రాజధానిని కదల్చలేరని ఆయన అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని.. లోక్సభలో చట్టబద్దత బిల్లుకు ఆమోదం పొందటం ఆంధ్రులకు దక్కిన గౌరవమని సీఎం అన్నారు.

బిల్లు ఆమోదంతో అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని చంద్రబాబు తెలిపారు. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి.. ఈ బిల్లుకు మద్దతు పలికిన పార్టీలకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. గత పాలకులు మూడు ముక్కలాటతో విధ్వంసం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆక్షేపించారు.
ప్రతీ నెలా మొదటి తేదీన పేదల సేవలో ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా పేదల సేవలో ఉంటున్నామని తెలిపారు. ప్రతీ నెలా రూ.2,750 కోట్లను పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్న ప్రభుత్వం ఏపీనే అని సీఎం వివరించారు. పొరుగున తమిళనాడులో కేవలం రూ. వెయ్యి మాత్రమే పెన్షన్ గా ఇస్తున్నారని అన్నారు. ప్రజలపై ఉన్న అభిమానంతోనే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని చేయగలుగుతున్నామని సీఎం వివరించారు.
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పాతచెరువుకు సోమశిల కాలువ నుంచి నీటిని తరలించేందుకు రూ.34 కోట్లతో పనులు చేపడతామని దీనిపై తక్షణం ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి చెరువును నింపుతామని భరోసా ఇచ్చారు. నీటి భద్రత కోసం స్థానిక వింజమూరు ప్రజలు వేసిన ఒక్క అడుగుకు ప్రజా ప్రభుత్వం వంద అడుగులు ముందుకు వేసి తోడుగా నిలబడుతుందన్నారు. రూ.70 లక్షల వ్యయంతో చెరువును పునరుద్ధరణకు తీసుకున్న చొరవను ముఖ్యమంత్రి అభినందించారు.
నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని.. రామాయపట్నం పోర్టు, దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్తో పాటు రక్షణ పరికరాలు, మానవ రహిత విమానాలు తయారవుతాయని చంద్రబాబు అన్నారు. ఇఫ్కో సెజ్లో ఏర్పాటు కానున్న సౌర ఫలకాల తయారీ సహా వేర్వేరు పరిశ్రమల ద్వారా 80 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని 2018 లోనే కేంద్రానికి లేఖ రాసి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. రూ.285 కోట్లతో దీని నిర్మాణం చేపట్టామని.. దీనిని వక్రీకరించి కొందరు హిట్ అండ్ రన్ నేరాల రాజకీయం చేస్తున్నారని సీఎం ఆక్షేపించారు.
{{/usCountry}}నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని.. రామాయపట్నం పోర్టు, దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్తో పాటు రక్షణ పరికరాలు, మానవ రహిత విమానాలు తయారవుతాయని చంద్రబాబు అన్నారు. ఇఫ్కో సెజ్లో ఏర్పాటు కానున్న సౌర ఫలకాల తయారీ సహా వేర్వేరు పరిశ్రమల ద్వారా 80 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని 2018 లోనే కేంద్రానికి లేఖ రాసి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. రూ.285 కోట్లతో దీని నిర్మాణం చేపట్టామని.. దీనిని వక్రీకరించి కొందరు హిట్ అండ్ రన్ నేరాల రాజకీయం చేస్తున్నారని సీఎం ఆక్షేపించారు.
{{/usCountry}}ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇవాల్టి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 93 వేల చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకూ, 11,488 పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తామని తెలిపారు. దీని కోసం మొత్తం 153 కోట్లను వ్యయం చేస్తున్నామని.. ఉచిత విద్యుత్ పథకం వల్ల ఒక్కో చేనేత కుటుంబానికి వేల రూపాయల మేర ఆదా అవుతుందన్నారు.