Tirumala Anivara Asthanam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో జరిగే అతి ముఖ్యమైన కొలువుల్లో ఈ ఆణివార ఆస్థానం అత్యంత విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు.
చారిత్రక నేపథ్యం……

సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో, కర్కాటక సంక్రాంతి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే, సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున ఈ కొలువును నిర్వహించడం వల్ల దీనికి 'ఆణివార ఆస్థానం' అనే పేరు వచ్చింది. దీనికి ఒక ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం కూడా ఉంది.
పూర్వం మహంతులు శ్రీవారి దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు ఇదే కావడంతో, నాటి నుండి టీటీడీ వారి వార్షిక ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర లెక్కల పుస్తకాలను కొత్తగా ప్రారంభించేవారు. అయితే టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత ఈ వార్షిక బడ్జెట్ కాలవ్యవధిని మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు. అయినప్పటికీ, పూర్వపు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
- ఆణివార ఆస్థానం పర్వదినం రోజున ఉదయం 7 గంటలకు బంగారువాకిలి ముందు భాగంలో ఉన్న ఘంటా మండపంలో ప్రత్యేక కొలువు జరుగుతుంది.
- ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి వారు సర్వభూపాల వాహనంపై గరుత్మంతునికి అభిముఖంగా వేంచేపు చేస్తారు.
- స్వామివారితో పాటు ఆయన సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనుల వారు మరొక పీఠంపై దక్షిణాభిముఖంగా కొలువుతీరుతారు.
- ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలో వేంచేసి ఉన్న మూలవిరాట్టుకు కూడా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలను సమర్పిస్తారు.
జీయ్యంగార్ల పట్టువస్త్రాల సమర్పణ….
ఈ ఉత్సవంలో జీయ్యంగార్ల వస్త్ర సమర్పణ ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి వారు ఒక పెద్ద వెండితట్టలో ఆరు పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. వీటిలో నాలుగు పట్టువస్త్రాలను ఆనందనిలయంలోని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకదానిని మలయప్పస్వామివారికి, మరొకదానిని విష్వక్సేనులవారికి అలంకరిస్తారు.
{{/usCountry}}ఈ ఉత్సవంలో జీయ్యంగార్ల వస్త్ర సమర్పణ ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి వారు ఒక పెద్ద వెండితట్టలో ఆరు పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. వీటిలో నాలుగు పట్టువస్త్రాలను ఆనందనిలయంలోని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకదానిని మలయప్పస్వామివారికి, మరొకదానిని విష్వక్సేనులవారికి అలంకరిస్తారు.
{{/usCountry}}అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం (చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణను స్వీకరిస్తారు. ఆ తర్వాత "నిత్యైశ్వర్యోభవ" అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఈ క్రతువు ముగిసిన వెంటనే అర్చకులు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామివారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామివారికి, ఆపై టీటీడీ కార్యనిర్వహణాధికారికి (EO) లచ్చన అనే తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం, ఆ తాళపు చెవి గుత్తిని తిరిగి శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు.
పుష్ప పల్లకీ సేవ…
ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై కొలువుతీరుతారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు.
ఆర్జిత సేవలు రద్దు:
ఆలయంలో ఆణివార ఆస్థానం వేడుకలు జరగనున్న కారణంగా జూలై 17వ తేదీన నిర్వహించాల్సిన పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజున కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు జరగవని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.