PM Modi Telangana Visit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక మైలురాయిగా నిలిచే భారీ ప్రాజెక్టులకు ఆయన ఈ సందర్భంగా అంకురార్పణ చేయనున్నారు.
పలు పనులకు శ్రీకారం….

మొత్తం రూ.7,823 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇందులో కొన్నింటికి శంకుస్థాపన చేయటంతో పాటు మరికొన్నింటిని జాతికి అంకితం చేస్తారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఈ పర్యటనలో భాగంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ పారిశ్రామిక నగరం వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు ఇది ప్రధాన కేంద్రంగా మారబోతోంది.
గత పదేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ఆ పరంపరను కొనసాగిస్తూనే….. తాజా పర్యటనలో రూ.7,823 కోట్ల నిధులతో పారిశ్రామిక, రవాణా రంగాలను బలోపేతం చేసే దిశగా అడుగులు పడనున్నాయి.
"మే 10వ తేదీన తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ… ఇక్కడ భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. మూడోసారి ప్రధాని అయ్యాక ఆయన రాష్ట్రానికి రావడం పట్ల ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహం నెలకొంది." అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ. 85 వేల కోట్ల రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయని…. కాజీపేట రైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు.సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు.
భారీ సభ…
{{/usCountry}}రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ. 85 వేల కోట్ల రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయని…. కాజీపేట రైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు.సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు.
భారీ సభ…
{{/usCountry}}మే 10వ తేదీన సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ సభను తలపెట్టింది. “జనాగ్రహ సభ”పేరుతో నిర్వహించబోయే ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. పారిశ్రామిక నగరం ప్రారంభోత్సవంతో పాటు అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది.