PM Modi Telangana Tour : మే రెండో వారంలో తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ…! కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
PM Modi Telangana Tour : మే రెండో వారంలో ప్రధానమంత్రి మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఇదే వేదికపై నుంచి కీలక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
PM Modi Telangana Tour : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. మే రెండో వారంలో ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని సమాచారం.

సికింద్రాబాద్ పరేడ్ మైదానం ఈ భారీ బహిరంగ సభకు వేదిక కానుంది. ఈ వేదిక నుంచే ప్రధాని తన ప్రసంగం ద్వారా అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు….. ఇటు తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించనున్నారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు, భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన….
పరేడ్ గ్రౌండ్స్ సభ నుంచే ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రధాని అధికారికంగా ప్రారంభిస్తారు. ఇది ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేయనుంది.
గిరిజన విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేసే లక్ష్యంతో ములుగులో నిర్మిస్తున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. రాష్ట్రంలోని ఏకైక ఎయిమ్స్ బీబీనగర్లో కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాలను ప్రధాని ప్రారంభించనున్నారు. దీనివల్ల వైద్య విద్యార్థులకు వసతి సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. మెగా టెక్స్టైల్ పార్కులో పూర్తయిన కీలక విభాగాలను ప్రధాని ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఖమ్మం - దేవరపల్లి మధ్య నిర్మించిన అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ రహదారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను వేగవంతం చేయనుంది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణకు తొలిసారిగా మోదీ రానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ పర్యటనలో భాగంగానే... మామునూరు విమానాశ్రయానికి కూడా శంకుస్థాపన చేస్తారని సమాచారం. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

