తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆగస్టు 1 నుంచి స్వామివారి పుష్కరిణి మూసివేత, ఎప్పటివరకంటే..?
Tirumala Swami Pushkarini : తిరుమల శ్రీవారి ఆలయం పక్కనున్న పవిత్ర స్వామి పుష్కరిణికి ఆగస్టు 1 నుంచి 31 వరకు మరమ్మతులు చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 10 వరకు భక్తులకు ప్రవేశం ఉండదు.
Tirumala Swami Pushkarini Closure : కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన స్వామి పుష్కరిణి నీటి శ్సుద్ధి, మరమ్మతు పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సమాయత్తమవుతోంది. ప్రతి ఏటా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పుష్కరిణికి మరమ్మతులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు నెల రోజుల పాటు పుష్కరిణి మరమ్మతు పనులను చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది.

ఈ ఏడాది సెప్టెంబరు 15వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల నాటికి పుష్కరిణిని సర్వాంగ సుందరంగా, పవిత్రంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పుష్కరిణిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి, అడుగున ఉన్న పూడికను తొలగించి… పైపింగ్ వ్యవస్థను పునరుద్ధరించనున్నారు.
40 రోజులు పుష్కరిణి మూసివేత…
సాధారణంగా ఆగస్టు ఆఖరు నాటికి మరమ్మతులు పూర్తయినప్పటికీ, వర్షాకాలం దృష్ట్యా టీటీడీ అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. భారీ వర్షాలు, తుఫాన్లు, ఇతర వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు కూడా పుష్కరిణిని మూసివేయనున్నారు.
ఈ నిర్ణయంతో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు…. అంటే మొత్తం 40 రోజుల పాటు పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తారు. అదేవిధంగా ఈ 40 రోజుల వ్యవధిలో భక్తులెవరినీ పుష్కరిణిలోకి దిగడానికి గానీ, స్నానాలు చేయడానికి గానీ అనుమతించరు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పును గమనించి, టీటీడీ యాజమాన్యానికి సంపూర్ణంగా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

