South Central Railway New Trains : తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వెళ్లే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.... ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ టౌన్ నుంచి కర్ణాటకలోని మైసూర్ వరకు కొత్త బై-వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును (Train Nos. 17289/17290) అందుబాటులోకి తెచ్చింది. గతంలో స్పెషల్ ట్రైన్ సర్వీసుగా (07033/07034) కొనసాగిన ఈ సర్వీసును రైల్వే బోర్డు ఇప్పుడు క్రమబద్ధీకరించి.... శాశ్వత ఎక్స్ప్రెస్ రైలుగా మార్చింది.

ఈ కొత్త రైలు సర్వీసులు మే నెల ప్రారంభం నుంచి పట్టాలెక్కనున్నాయి. బయల్దేరే సమయం, ఆగే స్టేషన్లు, ఇతర వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి....
- కాకినాడ టౌన్ - మైసూర్ ఎక్స్ప్రెస్ (17289): ఈ రైలు మే 1, 2026 నుంచి ప్రతి సోమవారం, శుక్రవారం అందుబాటులో ఉంటుంది.
- మైసూర్ - కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ (17290): ఈ రైలు మే 2, 2026 నుంచి ప్రతి మంగళవారం, శనివారం ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.
కాకినాడ టౌన్లో ఉదయం 09:00 గంటలకు బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు సాయంత్రం 16:00 గంటలకు మైసూర్ చేరుకుంటుంది. మైసూరు నుంచి ప్రారంభమయ్యే రైలు.... సాయంత్రం 5.05కు బయలుదేరి కాకినాడకు మరుసటి రోజు రాత్రి 11.30కు చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలోని పలు కీలక స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈ రైళ్లు... కాకినాడ టౌన్, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్ లో స్టేషన్లలో ఆగుతాయి.
ఈ కొత్త రైలు సర్వీస్ ద్వారా కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని పారిశ్రామిక నగరాలైన బెంగళూరు, మైసూర్ మధ్య అనుసంధానం మరింత మెరుగుపడనుంది. ఈ రైలు ప్రవేశపెట్టడం వల్ల అటు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులతో పాటు పర్యాటకులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది,
{{/usCountry}}ఈ కొత్త రైలు సర్వీస్ ద్వారా కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని పారిశ్రామిక నగరాలైన బెంగళూరు, మైసూర్ మధ్య అనుసంధానం మరింత మెరుగుపడనుంది. ఈ రైలు ప్రవేశపెట్టడం వల్ల అటు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులతో పాటు పర్యాటకులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది,
{{/usCountry}}