దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వేళాంకన్ని ఉత్సవం 2026 సందర్భంగా అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ లోకమాన్య తిలక్ - వేళాంకన్ని - లోకమాన్య తిలక్ మధ్య ప్రత్యేక రైలు సేవలను అందిస్తోంది. ఈ ట్రైన్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తాయి. రైల్వే ప్రయాణికులు ఈ ట్రైన్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.

ట్రైన్ నెంబర్ 01161 లోకమాన్య తిలక్ - వేళాంకన్ని బుధ, సోమ వారాల్లో ఉదయం 11.50 గంటలకు బయల్దేరుతుంది. శుక్ర, బుధవారాల్లో వేళాంకన్నికి ఉదయం 2 గంటలకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ సర్వీస్ ఆగస్టు 26, సెప్టెంబర్ 7వ తేదీన రెండు సర్వీసులు నడుస్తుంది.
01162 ట్రైన్ వేళాంకన్ని నుంచి శుక్ర, బుధవారాల్లో ఉదయం 5.15 గంటలకు బయల్దేరుతుంది. శని, గురువారాల్లో సాయంత్రం 4 గంటలకు లోకమాన్య తిలక్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ సర్వీసులు ఆగస్టు 28, సెప్టెంబర్ 9వ తేదీల్లో ఉంది.
ఈ ప్రత్యేక రైళ్లు థానే, కళ్యాణ్, లోనావాలా, పూణే, దౌండ్, షోలాపూర్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, తిరువణ్ణమలై, విల్లుపురం, మయిలాదుతురై జంక్షన్, నాగపట్నం స్టేషన్లలో రెండువైపులా ఆగుతుంది. ముందస్తు రిజర్వేషన్లు 02.08.2026(ఆదివారం) ఉదయం 08:00 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ రైళ్లలో ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.
ప్రయాగ్రాజ్-తిరునెల్వేలి
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాగ్రాజ్, తిరునెల్వేలి మధ్య ప్రత్యేక రైళ్లను నడపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వరంగల్, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
{{/usCountry}}ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాగ్రాజ్, తిరునెల్వేలి మధ్య ప్రత్యేక రైళ్లను నడపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వరంగల్, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
{{/usCountry}}రైలు నంబర్ 04171 (ప్రయాగ్రాజ్ - తిరునెల్వేలి) : ఈ రైలు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. 01.08.2026 నుంచి 22.08.2026 వరకు మొత్తం 4 సర్వీసులను నడపనున్నారు.
రైలు నంబర్ 04172 (తిరునెల్వేలి - ప్రయాగ్రాజ్) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి సోమవారం నడుస్తుంది. 03.08.2026 నుంచి 24.08.2026 మధ్య మొత్తం 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు ఇరువైపులా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లోని అనేక ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. మాణిక్పూర్, సత్నా, కట్ని, జబల్పూర్, ఇటార్సి, నాగ్పూర్, చంద్రపూర్, బలార్షా, సిర్పూర్ కాగజ్నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేటై, సేలం, నామక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, శాతూర్, కోవిల్పట్టి స్టేషన్లలో ఆగుతాయి.