వందే భారత్ ట్రైన్స్ వచ్చాక చాలా మంది ఇబ్బంది లేకుండా ప్రయాణం చేస్తున్నారు. జర్నీలో ఎక్కువగా అలసిపోకుండా నేరుగా సొంతూళ్లకు వెళ్తున్నారు. అంతేకాదు వేగంగా సిటీలను ఈ రైళ్లు కనెక్ట్ చేస్తాయి. దీంతో వీటిలో ప్రయాణించేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో వందే భారత్ రైలుకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

ఈ రూట్లో ఉన్న డిమాండ్ ఆధారంగానే ఇటీవల కోచ్లను పెంచారు. నిజానికి ఈ రూట్లో మెుదట 16 కోచ్లతోనే వందే భారత్ రైళ్లు నడిచాయి. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కోచ్లను 20కి పెంచారు. ఇందులో ఏసీ చైర్ కార్కోచ్లు 18 కాగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కోచ్లు రెండు ఉన్నాయి. దీంతో సీటింగ్ కెపాసిటీ.. 1128 నుంచి 1440కు పెరిగింది. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ ప్రారంభించినప్పటి నుంచి ఆక్యుపెన్సీకి మించిన డిమాండ్తో నడుస్తోంది. దీంతో కోచ్లు పెంచినట్టుగా రైల్వే అధికారులు తెలిపారు.
ఈ రూట్లో సాధారణంగా వీకెండ్స్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది శుక్రవారం, శనివారం ఈ రూట్లలో ఎక్కువగా ప్రయణిస్తుంటారు. తిరిగి ఆదివారం సికింద్రాబాద్కు రిటర్న్ వస్తుంటారు. అందుకే ఈ రోజుల్లో రష్ ఎక్కువగా ఉంటుంది. విశాఖ నుంచి కూడా వీకెండ్స్లో చాలామంది హైదరాబాద్కూ ఈ రూట్ ఉపయోగించుకుని వస్తారు.
రైలు నంబర్ 20707 (సికింద్రాబాద్ - విశాఖపట్నం) సికింద్రాబాద్లో 05:00 గంటలు బయలుదేరుతుంది. విశాఖపట్నంలో 1:50 గంటలు చేరుకుంటుంది. రైలు నంబర్ 20708 (విశాఖపట్నం - సికింద్రాబాద్) విశాఖపట్నంలో మధ్యాహ్నం 02:30 గంటలు బయలుదేరుతుంది. సికింద్రాబాద్కు రాత్రి 11:25 గంటలకు చేరుకుంటుంది. దీంతో వీకెండ్స్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక పండుగల సమయాల్లో ఈ రూట్లో టికెట్ దొరకడం కష్టమనే చెప్పాలి.
ఈ సర్వీస్ గురువారం మినహా వారానికి ఆరు రోజులు పనిచేస్తుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఆరు స్టేషన్లలో ఆగుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటలో హాల్టింగ్ ఉంది. ఈ రైలు 699 కి.మీ. దూరాన్ని 8 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ కారిడార్లో అత్యంత వేగవంతమైన కనెక్షన్లలో ఒకటిగా ఈ సర్వీస్కు డిమాండ్ బాగా ఉంది.
{{/usCountry}}ఈ సర్వీస్ గురువారం మినహా వారానికి ఆరు రోజులు పనిచేస్తుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఆరు స్టేషన్లలో ఆగుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటలో హాల్టింగ్ ఉంది. ఈ రైలు 699 కి.మీ. దూరాన్ని 8 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ కారిడార్లో అత్యంత వేగవంతమైన కనెక్షన్లలో ఒకటిగా ఈ సర్వీస్కు డిమాండ్ బాగా ఉంది.
{{/usCountry}}ఈ వందే భారత్ రైతులో రెండు సీటింగ్ తరగతులు అందుబాటులో ఉన్నాయి. ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,750, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.3,200 ధరగా ఉంది. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ షెడ్యూల్లో ఇటీవలే మార్పు జరిగిన విషయం తెలిసిందే.