విశాఖ సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ సందర్భంగా దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 17, 2026 నుండి బ్యాంకుల ద్వారా టికెట్ల విక్రయాలను నిలిపివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అధికారిక వెబ్సైట్ (https://chandanotsavam.ap.gov.in), ప్రభుత్వ 'మన మిత్ర' వాట్సాప్ సేవ ద్వారా మాత్రమే టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటి బుకింగ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి.

మనమిత్ర వాట్సాప్ ద్వారా రూ.1,000 విలువైన 460 టికెట్లు, రూ.300 విలువైన 750 టికెట్లు విడుదల చేస్తారు. అదే సమయంలో, ఆన్లైన్లో 2,215 టికెట్లు రూ.1,000, 3,370 టికెట్లు రూ.300) అందుబాటులో ఉంటాయి. చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని నివారించేందుకు, కేటాయించిన కోటా పరిధిలో భక్తులు ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 8 గంటల నుంచి టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. భక్తులు టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్సైట్ https://chandanotsavam.ap.gov.in ద్వారా, వాట్సాప్ నెంబర్ 9552300009 మన మిత్ర ద్వారా బుక్ చేసుకోవచ్చు.
ఏప్రిల్ 20వ తేదీన సింహాచలం అప్పన్నస్వామివారికి చందనోత్సవం జరగనుంది. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా.. భక్తులు అందుబాటులో ఉన్న టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలి.
మరోవైపు విశాఖ సింహాచలం అప్పన్నస్వామివారికి సమర్పించే చందనం కోసం అరగదీత కార్యక్రమం ఇప్పటికే నిర్వహించారు. స్వామికి సమర్పించే చందన చెక్కలను ముక్కలుగా కట్ చేసి అరగదీశారు. మెుదట పూసపాటి వంశస్థులు అప్పన్న స్వామిని దర్శించుకుంటారు.
ఈ నెల 20వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. దర్శనాల కోసం 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఏఐ పరిజ్ఞానంతో చందనోత్సవంలో పాల్గొనే భక్తుల సంఖ్య లెక్కిస్తారు.
టికెట్ల డబ్బులు రిటర్న్
మరోవైపు ఏప్రిల్ 13 నుంచి 17వ తేదీ వరకు అప్పన్నస్వామివారి నిజరూప దర్శనం కల్పించిన విషయం తెలిసిందే. ఇందుకోసం టికెట్లు విక్రయించారు. ఇందులో కాస్త గందరగోళం నెలకొన్నది. ఆన్లైన్లో నిజరూప దర్శనం టికెట్లు బుక్ చేసుకొని నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తి అయినా.. టికెట్లు రాని భక్తులకు భక్తుల ఖాతాల్లో మెుత్తం నగదు జమ చేస్తామని సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు చెప్పారు.
{{/usCountry}}మరోవైపు ఏప్రిల్ 13 నుంచి 17వ తేదీ వరకు అప్పన్నస్వామివారి నిజరూప దర్శనం కల్పించిన విషయం తెలిసిందే. ఇందుకోసం టికెట్లు విక్రయించారు. ఇందులో కాస్త గందరగోళం నెలకొన్నది. ఆన్లైన్లో నిజరూప దర్శనం టికెట్లు బుక్ చేసుకొని నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తి అయినా.. టికెట్లు రాని భక్తులకు భక్తుల ఖాతాల్లో మెుత్తం నగదు జమ చేస్తామని సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు చెప్పారు.
{{/usCountry}}అలా సోమ్ము చెల్లించినా.. టికెట్లు రానివారి లిస్ట్ సిద్ధం చేయాలని సిబ్బందిని ఈవో ఆదేశించారు. చందనోత్సవం తర్వాత.. టికెట్లు పొందనివారి ఖాతాలకు సొమ్ము పంపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు ఆందోళన చెందకూడదని భరోసా ఇచ్చారు.