రాయనపాడు యార్డ్ ఆధునీకరణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన ప్రకటన చేసింది. పలు రైళ్లను పూర్తిగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో శాతవాహన, గోల్కొండ, గౌతమి ఎక్స్ప్రెస్ వంటివి కూడా ఉన్నాయి.

ఈ రైళ్ల రద్దు నిర్ణయం ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు అమల్లోకి ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను సరిచూసుకోవాలని కోరింది.
రద్దు చేసిన రైళ్ల వివరాల లిస్ట్ :
- విజయవాడ - భద్రాచలం రోడ్ - విజయవాడ(67215 / 67216) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లను 28.04.26 నుండి 05.05.26 వరకు రద్దు చేశారు.
- విజయవాడ - డోర్నకల్ - విజయవాడ(67768 / 67767) మధ్య ప్రతిరోజు నడిచే రైళ్లు కూడా రద్దు అయ్యాయి. ఏప్రిల్ 28 నుంచి 05.05.26 వరకు రాకపోకలు ఉండవు.
- విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ (శాతవాహన -12713 / 12714) రైళ్లు మే 2వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు రద్దవుతాయి.
- గుంటూరు - సికింద్రాబాద్ - విజయవాడ (గోల్కొండ - 17201 / 17202) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లు మే 2 నుంచి 5వ తేదీ వరకు క్యాన్సిల్ అవుతాయి.
- గుంటూరు - సికింద్రాబాద్ - గుంటూరు(12705 / 12706) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లను మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రద్దవుతాయి.
- విశాఖపట్నం - మహబూబ్నగర్ - విశాఖపట్నం(12861 / 12862) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లను మే 1 నుంచి మే 5 వరకు రద్దు చేశారు.
- కాకినాడ పోర్ట్ - లింగంపల్లి - కాకినాడ పోర్ట్ (గౌతమి -12737 / 12738) మధ్య ప్రతిరోజూ నడిచే రైళ్లను మే 1 నుంచి 5వ తేదీ వరకు రద్దు చేశారు.
- కాకినాడ టౌన్ - లింగంపల్లి - కాకినాడ టౌన్ (12775 / 12776) మధ్య వారానికి 3 రోజులు నడిచే రైళ్లు మే 3, 4 తేదీల్లో రద్దవుతాయి.
- సంబల్పూర్ - హెచ్.ఎస్. నాందేడ్ - సంబల్పూర్(20809 / 20810)మధ్య వారానికి 3 రోజులు నడిచే రైళ్లు మే 1,2 3, 4,5 తేదీల్లో రద్దవుతాయి.
- విశాఖపట్నం - హెచ్.ఎస్. నాందేడ్ - విశాఖపట్నం(20811 / 20812) మధ్య వారానికి 3 రోజులు నడిచే రైళ్లు మే 2 3 తేదీల్లో రద్దవుతాయి.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}