SCR Summer Special Trains 2026 : వేసవి కాలం వచ్చిందంటే చాలు రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో… చాలా మంది సొంతూళ్లకు వెళ్లటం లేదా పర్యాటక ప్రాంతాలకు పయనమవుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఈ అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు రూట్లలో 'సమ్మర్ స్పెషల్' రైళ్లను నడపాలని నిర్ణయించింది.
ప్రత్యేక రైళ్లు - రూట్లు, ఆగే స్టేషన్లు

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. .. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి (06073) మధ్య రెండు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు ఏప్రిల్ 20 మరియు 27 తేదీలలో (సోమవారం) రాత్రి 23:45 గంటలకు చెన్నైలో బయలుదేరి, బుధవారం ఉదయం 07:45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సంత్రాగచ్చి - చెన్నై బీచ్ (06074) రైలు ఏప్రిల్ 22 మరియు 29 తేదీలలో (బుధవారం) ఉదయం 10:45 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 19:30 గంటలకు చేరుకుంటుంది.
ఈ రైళ్లు ఏపీలోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ , పలాస వంటి స్టేషన్లలో ఆగుతాయి.ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ సెకండ్ టైర్, ఏసీ థర్డ్ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లుంటాయి.
మరోవైపు నాగర్కోయిల్ - షాలిమార్ - నాగర్కోయిల్ (06057/06058) మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. నాగర్కోయిల్ నుంచి ఏప్రిల్ 15న ఉదయం 11:40 గంటలకు బయలుదేరే రైలు శుక్రవారం మధ్యాహ్నం 14:30 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షాలిమార్ నుంచి ఏప్రిల్ 18న మధ్యాహ్నం 14:00 గంటలకు బయలుదేరి సోమవారం సాయంత్రం 17:30 గంటలకు నాగర్కోయిల్ చేరుకుంటుంది.
ఈ రైళ్లు కూడా రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం స్టేషన్ల మీదుగా నడుస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ సెకండ్ టైర్, ఏసీ థర్డ్ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను అందుబాటులో ఉంచారు.
{{/usCountry}}ఈ రైళ్లు కూడా రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం స్టేషన్ల మీదుగా నడుస్తాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ సెకండ్ టైర్, ఏసీ థర్డ్ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను అందుబాటులో ఉంచారు.
{{/usCountry}}టికెట్లు కోరుకునే వారు అధికారిక వెబ్సైట్ లేదా ఐఆర్సీటీసీ (IRCTC) యాప్ ద్వారా ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరింది.