SCR Summer Special Trains 2026 : వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ నుండి బెంగళూరు సమీపంలోని యెలహంక మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్ మీదుగా ప్రయాణిస్తాయి. జూలై 2వ తేదీ వరకు మొత్తం 10 సర్వీసులను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ రైళ్లలో థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయి.
- బిలాస్పూర్ - యెలహంక ప్రత్యేక రైలు(రైలు నంబర్ 08261) : ఈ రైలు 2026 జూన్ 3 నుండి జూలై 1 వరకు ప్రతి బుధవారం మధ్యాహ్నం 14.00 గంటలకు బిలాస్పూర్లో బయలుదేరుతుంది. మరుసటి రోజు (గురువారం) రాత్రి 19.00 గంటలకు యెలహంక చేరుకుంటుంది. ఈ రూట్లో మొత్తం 5 సర్వీసులు నడుస్తాయి.
- యెలహంక - బిలాస్పూర్ ప్రత్యేక రైలు(రైలు నంబర్ 08262) : ఈ రైలు 2026 జూన్ 4 నుండి జూలై 2 వరకు ప్రతి గురువారం రాత్రి 21.30 గంటలకు యెలహంకలో బయలుదేరుతుంది. శనివారం తెల్లవారుజామున 03.30 గంటలకు బిలాస్పూర్ చేరుకుంటుంది. ఈ రూట్లో కూడా 5 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
రైళ్లు ఆగే ప్రధాన స్టేషన్లు (హాల్ట్స్)
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణిస్తూ ప్రయాణికులకు అనుకూలంగా అనేక కీలక స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో భాతాపరా, రాయ్పూర్, దుర్గ్, రాజ్నంద్గావ్, డోంగర్గఢ్, గోందియా, వాడ్సా, చందా ఫోర్ట్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణ, రాయచూరు, మంత్రాలయం రోడ్, గుంతకల్, గూటి, అనంతపురం, ధర్మవరం స్టేషన్లు ఉన్నాయి. వేసవి సెలవుల్లో సొంత ఊళ్లు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణిస్తూ ప్రయాణికులకు అనుకూలంగా అనేక కీలక స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో భాతాపరా, రాయ్పూర్, దుర్గ్, రాజ్నంద్గావ్, డోంగర్గఢ్, గోందియా, వాడ్సా, చందా ఫోర్ట్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణ, రాయచూరు, మంత్రాలయం రోడ్, గుంతకల్, గూటి, అనంతపురం, ధర్మవరం స్టేషన్లు ఉన్నాయి. వేసవి సెలవుల్లో సొంత ఊళ్లు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
{{/usCountry}}