సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది సొంత ఊర్లలోకి వెళ్లగా... తిరుగు ప్రయాణాలు షురూ చేస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లలో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. రద్దని తగ్గించేందుకు విశాఖపట్నం - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
విశాఖ - చర్లపల్లి స్పెషల్ ట్రైన్…

దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం... విశాఖపట్నం - చర్లపల్లి (ట్రైన్ నెంబర్ 08517) జనవరి 18వ తేదీన ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైమ్ మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి... మరునాడు ఉదయం 7.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
చర్లపల్లి - విశాఖపట్నం(ట్రైన్ నెంబర్ 08518) మధ్య జనవరి 19వ తేదీన మరో స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు... చర్లపల్లి నుంచి ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు అర్ధరాత్రి 12.30 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు... దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామల్ కోట, రాజమండ్రి, నిడదోవలు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లులో 2ఏసీ, 3ఏసీ స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి. ఈసేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.
మరోవైపు వికారాబాద్ - తిరుపతి మధ్య జనవరి 19వ తేదీన స్పెషల్ ట్రైన్ నడవనుంది. ఈ ప్రత్యేక రైలు సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్... సత్తెనపల్లి, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.