SCR Guntur Charlapalli Special Trains : తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు, ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు గుంటూరు నుండి హైదరాబాద్లోని చర్లపల్లి స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
రైళ్ల వివరాలు…
- గుంటూరు - చర్లపల్లి రైలు (రైలు నంబరు 07227) : ఈ ప్రత్యేక రైలు సెప్టెంబర్ 6, 2026 ఆదివారం రోజున రాత్రి 21:45 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి, మరుసటి రోజు (సెప్టెంబర్ 7) ఉదయం 04:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
- చర్లపల్లి - గుంటూరు రైలు (రైలు నంబరు 07228 ): తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు సెప్టెంబర్ 7, 2026 సోమవారం రోజున రాత్రి 23:50 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 06:10 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.

{{^htLoading}} {{/htLoading}}
ఇరువైపులా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు వివిధ శ్రేణుల సీట్లు అందుబాటులో ఉన్నాయి. AC 2-టియర్ (2A), AC 3-టియర్ (3A), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలను ఈ రైళ్లకు కేటాయించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోవాలని అధికారులు సూచించారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}