తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మంచి శుభవార్త అందించింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ఆ రద్దీని నియంత్రించేందుకు మరియు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు గుంటూరు - వికారాబాద్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
- రైలు నంబరు 07227 (గుంటూరు – వికారాబాద్) : ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 30న (ఆదివారం) రాత్రి 9:45 గంటలకు గుంటూరులో బయలుదేరి, మరుసటి రోజు (ఆగస్టు 31, సోమవారం) ఉదయం 5:00 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
- రైలు నంబరు 07228 (వికారాబాద్ – గుంటూరు) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 31న (సోమవారం) రాత్రి 10:00 గంటలకు వికారాబాద్లో బయలుదేరి, మరుసటి రోజు (సెప్టెంబర్ 1, మంగళవారం) ఉదయం 6:10 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
స్టాప్ల వివరాలు:

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో పలు కీలకమైన స్టేషన్లలో ఆగుతాయి. ఆ వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి….
- సత్తెనపల్లి
- పిడుగురాళ్ల
- నడికుడి
- మిర్యాలగూడ
- నల్గొండ
- చార్లపల్లి
- సికింద్రాబాద్
- బేగంపేట్
- లింగంపల్లి
కోచ్ల వివరాలు:=…
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని వర్గాల వారికి తగినట్లుగా సీటింగ్ వసతి కల్పించారు. వీటిలో సెకండ్ ఏసీ (2A), థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్ (Sleeper Class) మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.