...
...
Next Story

Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్… పలాసా - విజయవాడ మధ్య ప్రత్యేక జనసాధారణ్ రైళ్లు, షెడ్యూల్ వివరాలివే

Palasa Vijayawada Janasadharan Trains : ఆర్ఆర్‌బీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటి) రాసే అభ్యర్థుల రద్దీ దృష్ట్యా పలాసా-విజయవాడ మధ్య జనసాధారణ్ స్పెషల్ రైళ్లను నడపనున్నారు. ఈ వేరకు దక్షిణ కోస్తా రైల్వే వివరాలను ప్రకటించింది.

Published on: Aug 2, 2026, 10:34:46 IST
Advertisement

Palasa Vijayawada Janasadharan Trains : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)కు హాజరయ్యే అభ్యర్థులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు అందించింది. పరీక్షల వేళ అభ్యర్థులు, ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు విజయవాడ డివిజన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలాసా - విజయవాడ స్టేషన్ల మధ్య అన్‌రిజర్వ్‌డ్ జనసాధారణ్ స్పెషల్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, సౌకర్యవంతంగా తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 10 జనరల్ క్లాస్ కోచ్‌లతో పాటు 2 ఎస్‌ఎల్‌ఆర్ (SLR) కోచ్‌లతో కలిపి మొత్తం 12 ఐసిఎఫ్ అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉంటాయి.

రైళ్ల షెడ్యూల్ :

  • రైలు నంబర్ 07067 (పలాసా - విజయవాడ స్పెషల్): ఈ రైలు 02.08.2026 నుం;f 05.08.2026 వరకు ప్రతిరోజూ పలాసా నుంచి బయలుదేరి 4 ట్రిప్పులు నడుస్తుంది. పలాసాలో మధ్యాహ్నం 14:00 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు అర్ధరాత్రి 01:00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
  • రైలు నంబర్ 07068 (విజయవాడ - పలాసా స్పెషల్) : ఈ రైలు 03.08.2026 నుం'f 06.08.2026 వరకు ప్రతిరోజూ విజయవాడ నుంచి బయలుదేరి 4 ట్రిప్పులు నడుస్తుంది. విజయవాడలో సాయంత్రం 16:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 04:30 గంటలకు పలాసా చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తాయి. రెండు మార్గాల్లో నిలిచే ప్రధాన స్టేషన్లు, వాటి సమయాలు క్రింది విధంగా ఉన్నాయి..

  • శ్రీకాకుళం రోడ్ : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 14:50/14:52 గంటలకు; తిరుగు ప్రయాణంలో 02:43/02:45 గంటలకు చేరుకుంటుంది.
  • విజయనగరం : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 15:43/15:45 గంటలకు; తిరుగు ప్రయాణంలో 01:48/01:50 గంటలకు నిలుస్తుంది.
  • సింహాచలం : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 16:28/16:30 గంటలకు; తిరుగు ప్రయాణంలో 01:08/01:10 గంటలకు చేరుకుంటుంది.
  • విశాఖపట్నం : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 17:50/18:10 గంటలకు; తిరుగు ప్రయాణంలో 00:30/00:50 గంటలకు అందుబాటులో ఉంటుంది.
  • దువ్వాడ : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 18:40/18:42 గంటలకు; తిరుగు ప్రయాణంలో 23:35/23:37 గంటలకు చేరుకుంటుంది.
  • తుని: పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 19:42/19:44 గంటలకు; తిరుగు ప్రయాణంలో 21:33/21:35 గంటలకు అందుబాటులో ఉంటుంది.
  • సామర్లకోట : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 20:22/20:24 గంటలకు; తిరుగు ప్రయాణంలో 20:55/20:57 గంటలకు చేరుకుంటుంది.
  • రాజమండ్రి : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 21:15/21:20 గంటలకు; తిరుగు ప్రయాణంలో 20:10/20:15 గంటలకు నిలుస్తుంది.
  • ఏలూరు : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 22:38/22:40 గంటలకు; తిరుగు ప్రయాణంలో 17:45/17:47 గంటలకు అందుబాటులో ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe