...
...
Next Story

ఆగస్టు 13 నుంచి ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస ప్రత్యేక కుంకుమార్చన సేవలు.. టికెట్ ధర ఎంత?

పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన ఆచారాలను దేవస్థానం ప్రకటించింది. ఆగస్టు 13వ తేదీ నుంచి ఈ సేవలు ఉంటాయి.

Published on: Aug 12, 2026, 21:18:05 IST
Advertisement

శ్రావణ మాస శుభ ఘడియలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక కుంకుమార్చన సేవలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ ప్రకటించారు. పరమ పవిత్రమైన శ్రావణ మాసం మొత్తాన్ని పురస్కరించుకుని ఆగస్టు 13 నుండి సెప్టెంబర్ 11 వరకు ఈ ప్రత్యేక ఆర్జిత సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.

శ్రావణ మాసం ప్రత్యేక కుంకుమార్చన
శ్రావణ మాసం ప్రత్యేక కుంకుమార్చన

ఇంద్రకీలాద్రి పైభాగంలో ఉన్న ఆలయ పూజా మండపంలో ప్రతిరోజూ ఈ పూజలు నిర్వహిస్తారు. ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. ప్రత్యేక కుంకుమార్చన టికెట్ ధర రూ. 1,000 గా నిర్ణయించారు. ఒక టికెట్‌పై దంపతులు లేదా ఇద్దరు భక్తులకు పూజలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.

భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలలో టికెట్లు అందుబాటులో ఉంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన అధికారిక మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవ ద్వారా భక్తులు ఇంటి నుంచే సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీనికోసం 9552300009 నంబర్‌కు మెసేజ్ చేసి సేవలను పొందవచ్చని అధికారులు వెల్లడించారు.

ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ టికెట్ కియోస్క్‌లు లేదా ఆర్జిత సేవా కౌంటర్ల ద్వారా నేరుగా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. శ్రావణ మాసంలో కనకదుర్గమ్మ వారి సన్నిధిలో కుంకుమార్చన పూజలు నిర్వహించడం అత్యంత విశేషమైనదిగా, మంగళకరమైనదిగా భావిస్తారు. ఈ పూజలో పాల్గొనడం వల్ల సౌభాగ్యం, ఆయురారోగ్యాలు సిద్ధించి దుర్గమ్మ దివ్య ఆశీస్సులు లభిస్తాయని ఈఓ సీనా నాయక్ తెలిపారు. భక్తులందరూ ఈ ప్రత్యేక ఆర్జిత సేవను వినియోగించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

ముగిసిన ఆషాఢ మాస సారె సమర్పణ

ఈ ముగింపు వేడుక ఆషాఢ మాసపు చివరి రోజైన ఆషాఢ బహుళ అమావాస్య నాడు జరిగింది. ఉదయం 9 గంటలకు ఆలయ స్థానాచార్యులు వి. శివప్రసాద్ పర్యవేక్షణలో జమ్మిదొడ్డి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, కోలాటం, సాంప్రదాయ సంగీత నృత్యాల నడుమ సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ ఊరేగింపు కనకదుర్గ నగర్ మీదుగా సాగి ఆలయ ప్రాంగణానికి చేరుకుంది.

ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్, ఆయన సతీమణి, అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆలయ సిబ్బంది తరపున చివరి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఇంద్రకీలాద్రిని సందర్శించారు. భక్తులు అమ్మవారికి సారె సమర్పించగా, ఆలయ అర్చకులు ప్రత్యేక సామూహిక ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించి, ఉచితంగా ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe