ఈనెల 16 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయా విద్యార్థుల హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
స్కాన్ చేసి చెక్ చేసుకోవచ్చు…

పరీక్షా కేంద్రాలకు చేరుకునే విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా విద్యాశాఖ ఈ ఏడాది కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించింది. ఈ క్యూఆర్ కోడ్ ను మొబైల్ ఫోన్ తో స్కాన్ చేస్తే…. పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలి? ఎంత టైమ్ పడుతుందని వంటి వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఫలితంగా ఎగ్జామ్ సెంటర్ విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులకు ఓ అంచనాకు రావొచ్చు.
పట్టణాలు, నగరాల్లో ఎక్కువ పరీక్ష కేంద్రాలు ఉండటంతో వీటిని వెతుక్కోవడానికి విద్యార్థులు ఇబ్బందిపడొద్దనే ఉద్దేశ్యంతో ఈ కొత్త ఈ విధానం తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్యూఆర్ కోడ్ సాయంతో… చాలా సులభంగా ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవచ్చని సూచిస్తున్నారు.
హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ….
మరోవైపు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ అవకాశం ఉండనుంది. హాల్ టికెట్లను కండక్టర్లకు చూపిస్తే… ఫ్రీగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. తగినన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు దూరం ఉన్న చోట విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను నడిపాలని ఆర్టీసీ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఏపీ పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్…
- మార్చి 16, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18, 2026 – సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 21, 2026 - ఇంగ్లీష్
- మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
- మార్చి 25, 2026 – ఫిజిక్స్
- మార్చి 28, 2026 – బయాలజీ
- మార్చి 30 , 2026 – సోషల్ స్టడీస్
- మార్చి 31, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
- ఏప్రిల్ 1, 2026 – ఒకేషనల్ కోర్సు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు దూరం ఉన్న చోట విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను నడిపాలని ఆర్టీసీ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఏపీ పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్…
- మార్చి 16, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18, 2026 – సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 21, 2026 - ఇంగ్లీష్
- మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
- మార్చి 25, 2026 – ఫిజిక్స్
- మార్చి 28, 2026 – బయాలజీ
- మార్చి 30 , 2026 – సోషల్ స్టడీస్
- మార్చి 31, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
- ఏప్రిల్ 1, 2026 – ఒకేషనల్ కోర్సు.
ఏపీ టెన్త్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత…. పేపర్ వాల్యూయేషన్ ప్రారంభిస్తారు. మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత…. ఫలితాల విడుదలకు తేదీని ప్రకటిస్తారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ లో పొందొచ్చు.