తిరుమల పరకామణి కేసుకు సంబంధించి ఆలయ బోర్డు సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానా(టీటీడీ)నికి అనేక ప్రశ్నలు సంధించింది. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన టేబుళ్ల సంఖ్యకు సంబంధించిన వివరాలు నివేదికలో లేవని కోర్టు గమనించింది.

లుంగీలు ధరించి కౌంటింగ్ ప్రాంతంలోకి సిబ్బందిని అనుమతించే బదులు తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడాన్ని కూడా ప్రశ్నించింది. దీనికి ప్రతిస్పందనగా, బోర్డును సంప్రదించిన తర్వాత సంబంధిత వివరాలను సమర్పిస్తామని టీటీడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో బాధ్యులుగా తేలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.
ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సీఐడీ, ఏసీబీకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలని పేర్కొంది.
నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్టుగా సీఐడీ నివేదికలో స్పష్టంగా ఉందని హైకోర్టు పేర్కొంది. వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చోరీ కేసు మినహా సీఐడీ, ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాల మీద దర్యాప్తు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. తర్వాత విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది.
పరకామణి కేసుకు సంబంధించి అప్పటి సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్తోపాటు నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించిన ఎస్సై లక్ష్మీరెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ ముగురు అధికారులను పోలీస్ శాఖ వీఆర్కు పంపింది. కేసుతో ప్రమేయం ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలతో సీఐడీ కేసు నమేదు చేసే ఛాన్స్ ఉంది. అలాగే కేసుకు సంబంధించిన పత్రాలను తారుమారు చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్న సీఐ విజయ్ కుమార్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
{{/usCountry}}పరకామణి కేసుకు సంబంధించి అప్పటి సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్తోపాటు నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించిన ఎస్సై లక్ష్మీరెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ ముగురు అధికారులను పోలీస్ శాఖ వీఆర్కు పంపింది. కేసుతో ప్రమేయం ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలతో సీఐడీ కేసు నమేదు చేసే ఛాన్స్ ఉంది. అలాగే కేసుకు సంబంధించిన పత్రాలను తారుమారు చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్న సీఐ విజయ్ కుమార్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
{{/usCountry}}