...
...
Next Story

రైతులకు అప్డేట్.. పంట బీమా నమోదు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు?

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట బీమా చెల్లించే గడువును పొడిగించింది ప్రభుత్వం. రైతులు ఈ అవకాశాన్ని కచ్చితంగా ఉపయోగించుకోవాలి.

Published on: Aug 3, 2026, 16:13:32 IST
Advertisement

రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంట బీమా చెల్లించే చివరి తేదీని ఈ నెల ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థిక భక్షణ కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

పంట బీమా నమోదు గడువు పొడిగింపు
పంట బీమా నమోదు గడువు పొడిగింపు

ఇంతకుముందు నిర్ణయించిన తుది గడువు దగ్గర పడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ-సేవ కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు(CSC), గ్రామ/వార్డు సచివాలయాల వద్ద రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఒకేసారి వేలాది మంది పోర్టల్‌లోకి రావడంతో సాంకేతిక లోపాలు, సర్వర్ నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి.

దీంతో చాలామంది అర్హులైన రైతులు నమోదు చేసుకోలేకపోయారు. ఈ పరిస్థితిని గ్రహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సమస్య తీవ్రతను కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీమా కంపెనీలతో మాట్లాడి నమోదు గడువును పెంచేలా చర్యలు తీసుకుంది.

దీంతో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) - 2026 గడువు ఆగస్టు 15 వరకు పొడిగించారు. బ్యాంక్ రుణాలు పొందిన, పొందని రైతులందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రామ సచివాలయాలు, మీ-సేవ, సీఎస్సీ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పలు రకాల పంటలను ఈ బీమా పరిధిలోకి చేర్చారు. ప్రధాన పంటలు చూసుకుంటే.. వరి, పత్తి, మిరప, ఉల్లి, పసుపునకు వర్తిస్తుంది. అలాగే జొన్న, రాగి, సజ్జ, కొర్ర, మొక్కజొన్న, వేరుశనగ, మినుము, పెసర, నువ్వులు, ఆముదం రైతులు అప్లై చేసుకోవచ్చు.

రుణాలు ఉన్న రైతులతో పాటు ఎలాంటి రుణాలు తీసుకోని సాధారణ, కౌలు రైతులు కూడా తమ సమీప రైతు సేవా కేంద్రం లేదా సచివాలయానికి వెళ్లేసి, తక్కువ ప్రీమియంతో ఈ పంట బీమాను చేయించుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe