...
...
Next Story

Tomato Price : టమోట ధరలు ఢమాల్.. రైతుల నుంచి అతితక్కువ ధరకే.. కిలోకు ఎంతంటే?

కొన్ని రోజులు కింద భారీగా పలికిన టమోట ధరలు ఇప్పుడు పడిపోతున్నాయి. రైతుల దగ్గర నుంచి దళారులు అతి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు.

Published on: Feb 27, 2026, 06:54:32 IST
Advertisement

కొన్ని రోజుల కిందట టమోట ధరలు కిలోకు రూ.50 వరకు పలికాయి. కానీ ఇప్పుడు దారుణంగా పడిపోయాయి. మార్కెట్‌లోకి భారీగా టమోట వస్తుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్‌లాంటి ప్రభావాలతో ధరలు కిందకు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో సాధారణంగా పెరుగుదల కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం పడిపోయాయి.

టమోట ధరలు
టమోట ధరలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమోటా ధరలు తక్కువగానే ఉన్నాయి. మదనపల్లె, పలమనేరు ప్రధాన టమోటా మార్కెట్లలో 10 కిలోల పెట్టె కేవలం రూ.90 నుండి రూ.140 వరకు అమ్ముడవుతోంది. గతేడాది ఇదే కాలంలో సాధారణంగా రూ.300 నుండి రూ.600 మధ్య ఉన్న ధర కంటే చాలా తక్కువ. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పరిగణించబడే మదనపల్లెలో ధరలు కిలోకు రూ.9 నుండి రూ.14 వరకు పడిపోయాయి. దీనివల్ల రైతులకు రవాణా ఖర్చులు కూడా కలిసి రావడం లేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.5కి కూడా ధర పడిపోయింది.

మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ డేటా ప్రకారం.. ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా.. పంట మాత్రం వస్తూనే ఉంది. ఫిబ్రవరి 17న మొదటి గ్రేడ్ టమోటాలు 10 కిలోలకు రూ. 160–రూ.190, రెండో గ్రేడ్ టమోటాలు రూ. 110–రూ.150 ఉండగా, 46 మెట్రిక్ టన్నులు వచ్చాయి. ఫిబ్రవరి 24 నాటికి మొదటి గ్రేడ్ టమోటాలు 10 కిలోలకు రూ. 120–రూ.140, రెండో గ్రేడ్ టమోటాలు రూ. 90–రూ.110కి పడిపోయాయి. అయినప్పటికీ 66 మెట్రిక్ టన్నులకు దిగుమతి పెరిగింది. సరఫరా ఎక్కువగా ఉంది, డిమాండ్‌ తక్కువగా ఉంది.

టమోటా ధరలు ప్రస్తుతం కిలోకు రూ.7 , రూ.9 మధ్య ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో ధరల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

మరోవైపు పక్కరాష్ట్రమైన తెలంగాణలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణలో పలు కూరగాయల ధరలు పతనం అవుతున్నాయి. హైదరాబాద్‌లో టోకు ధరల్లో కిలో టమాట ధర రూ.8చొప్పున అమ్ముడవుతోంది. రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు ఇతర కూరగాయల ధరల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ధరలు తగ్గుతుండటంతో సామాన్యులకు ఊరల లభించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe