ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త వచ్చేసింది. విశాఖపట్నం - తిరుపతి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును రెగ్యూలర్ సర్వీసుగా క్రమబద్ధీకరించారు. ఈ మేరకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
రెగ్యూలర్ సర్వీసుగా మార్పు…

విశాఖపట్నం - తిరుపతి( 08547/08548) మధ్య స్పెషల్ ట్రైన్ నడుస్తోంది. ఇకపై ఈ ట్రైన్ రెగ్యూలర్ ట్రైన్ గా సేవలు అందించనుంది. దీంతో ఈ ట్రైన్ నెంబర్ ను 18505/18506 గా మార్పు చేశారు.
విశాఖపట్నం - తిరుపతి మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 18505) బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
ఇక తిరుపతి - విశాఖపట్నం(18506) మధ్య నడిచే ట్రైన్ గురువారం రాత్రి 21:50 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు 13:30 నిమిషాలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది.
ఆగే స్టేషన్లు ఇవే…
ఈ రెగ్యూలర్ ట్రైన్…. అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగనుంది. వారానికి ఒకసారి (బుధవారం విశాఖపట్నం నుండి / గురువారం తిరుపతి నుండి) మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
విశాఖపట్నం - తిరుపతి మధ్య నడిచే ఈ రెగ్యూలర్ ట్రైన్ లో 2 లగేజీ, గార్డ్ వ్యాన్లు, 04 జనరల్, 09 స్లీపర్ క్లాస్, 04 థర్డ్ ఏసీ (3rd AC), మరియు 03 సెకండ్ ఏసీ (2nd AC) కోచ్లుంటాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.