ఆంధ్రప్రదేశ్ వేదికగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి పెద్ద పీట వేసేందుకు ఒక భారీ సదస్సు సిద్ధమవుతోంది. వచ్చే జూలై 9, 10 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో 'వరల్డ్ ఫుడ్ ఇండియా' దక్షిణ ప్రాంతీయ సదస్సు జరగనుంది.

ఆహార రంగంలో సరికొత్త సాంకేతికత, ఎగుమతులు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే FICCI భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్నాయి.
ఈ సదస్సులో దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి ప్రతినిధులు వస్తారు. పుదుచ్చేరి, లక్ష్ద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు కూడా పాల్గొంటాయి.
ఈ సదస్సు ప్రధానంగా మన రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల ఆదాయాన్ని పెంచేలా సరికొత్త అవకాశాలను సృష్టించడానికి, ఈ రంగంలో వచ్చే కొత్త స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఎంతో దోహదపడుతుంది. ఆహార రంగంలో భారీగా పెట్టుబడులను తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అంతేకాదు సరికొత్త టెక్నాలజీని కూడా ప్రదర్శిస్తారు.
వ్యాపార భాగస్వామ్యాలను పెంపొందించుకోవడం, ఎగుమతి అవకాశాలను విస్తరించడంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది. వివిధ రాష్ట్రాల వ్యాపార సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తమ ఉత్పత్తులు, మౌలిక సదుపాయాలను ఇక్కడ ప్రదర్శిస్తాయి.
ఈ సదస్సులో బిజినెస్ టు బిజినెస్ (B2B), బిజినెస్ టు గవర్నమెంట్ (B2G) సమావేశాలు, కొనుగోలుదారులు-అమ్మకందారుల సమావేశాలు (Buyer-Seller Meets), ప్రముఖ కంపెనీల సీఈఓల రౌండ్ టేబుల్ చర్చలు జరగనున్నాయి. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అధికారుల సమాచారం ప్రకారం.. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు దక్షిణ రాష్ట్రాల మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ జి. విధాత్రి అధ్యక్షతన ఒక ప్రాథమిక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ జి. శేఖర్ బాబు, జనరల్ మేనేజర్ హనుమాన్ నాయక్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి సురేందర్ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు, FICCI ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు.
{{/usCountry}}ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ జి. విధాత్రి అధ్యక్షతన ఒక ప్రాథమిక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ జి. శేఖర్ బాబు, జనరల్ మేనేజర్ హనుమాన్ నాయక్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి సురేందర్ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు, FICCI ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు.
{{/usCountry}}