ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. పొడి వాతావరణ పరిస్థితులు

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం పట్టింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తెల్లవారుజామున మాత్రమే చలిగా ఉంటుంది. ఈ మేరకు వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది.

Updated on: Feb 8, 2026, 22:34:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాలలో వాతావరణం మారిపోయింది. చలి తీవ్రత తగ్గుతూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధానంగా తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పగటిపూట ఎండ వేడి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితిపై వాతావరణ శాఖ అప్డేట్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వాయువ్య, ఈశాన్య దిశల నుండి గాలులు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణాన్ని కలిగిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఉదయం సమయంలో పొగమంచు కనిపించవచ్చు. అమరావతి వాతావరణ కేంద్రం ఆది, సోమవారాల్లో పొడి పరిస్థితులు ఉంటాయని, కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మంగళవారం కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరం, యానాంలో రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండవచ్చని ఉష్ణోగ్రత అంచనాలు సూచిస్తున్నాయి. దక్షిణ తీరంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయని, కనిష్ట ఉష్ణోగ్రతలలో కనిష్ట మార్పు ఉంటుందని అంచనా. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్, యానాం అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు రాబోయే కొన్ని రోజులు స్థిరంగా ఉంటాయని అంచనా. తెలంగాణలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదించిన ప్రకారం దిగువ స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయం నుండి వీస్తాయని, దీని ప్రకారం కొన్ని రోజులు పొడి వాతావరణం కొనసాగుతుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలో మార్పులు ఉంటాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం సహా రాబోయే మూడు రోజులు ఆగ్నేయ గాలులు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణాన్ని తీసుకువస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More