ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో అమలు చేసిన భూముల రీసర్వే కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు 'క్రెడిట్ చోరీ' చేస్తున్నారని ఆరోపించారు.ఈ భూమండలం మీద ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలవారు ఎవరూ ఉండరంటూ దుయ్యబట్టారు.

గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు నిర్వహించిన తన పాదయాత్రలోనే భూముల రీసర్వేపై హామీ ఇచ్చానని గుర్తు చేశారు. అందుకు తగ్గట్టుగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత… 'వైఎస్సార్ జగన్నన్న శాస్వత భూహక్కు మరియు భూ రక్షా పథకం' (సమగ్ర భూ పునఃసర్వే) రూపొందించినట్లు తెలిపారు.
చంద్రబాబు ఏనాడైనా ఇలా చేశారా..? వైఎస్ జగన్
“మేం అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తానని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. రైతులకు, ప్రజలకు వివాదాలు లేనివిధంగా, పారదర్శకంగా భూములు సర్వే చేశాం. ట్యాంపరింగ్ చేయలేని విధంగా భూ యజమానులకు, రైతులకు శాశ్వత పత్రాలు ఇచ్చాం. భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం.వందేళ్లక్రితం బ్రిటిషర్ల కాలంలో భూ సర్వే చేశారు. ఆ తర్వాత 2020 డిసెంబర్ 21న భూముల రీ సర్వే ప్రారంభించాం. నాలుగు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏనాడైనా ఇలా చేశారా..? క్రయవిక్రయాలు జరిగినా సమస్యలు లేకుండా చేశాం.. అన్నదమ్ముల మధ్య పంపకాలు జరిగినా ఇబ్బందులు లేకుండా చేశాం” అని వైఎస్ జగన్ వివరించారు.
"యూరప్, అమెరికాలో వాడే టెక్నాలజీతో భూముల రీ సర్వే చేశాం. గ్రామ సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్లు చేశాం. మేం చేసిన భూ సర్వేను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబు ఎప్పుడైనా ఇలా చేశారా..? సర్వేలో హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించాం. టెక్నాలజీపై అవగాహన కోసం 40 వేల మందికి శిక్షణ ఇచ్చాం. కోట్ల సంఖ్యలో సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. 5 సెం.మీ కూడా తేడా లేకుండా కొలతలు వేశాం. రాష్ట్రంలో భూవివాదాల పరిష్కారానికి 1358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లను ఏర్పాటు చేశాం" అని వైఎస్ జగన్ తెలిపారు.
“భూసర్వేకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. 2020, డిసెంబర్ 9న సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. భూ సర్వే కోసం 3640 GNSS ఉపయోగించాం. నిజాలను ఎంతో కాలం తొక్కిపెట్టలేరు. భూముల రీ సర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కేరళ, ఉత్తరాఖండ్ అధికారులు సర్వేను అధ్యయనం చేశారు. మహారాష్ట్ర అధికారులు అధ్యయనం చేసి ప్రశంసించారు. సర్వేను .. అప్పటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మెచ్చుకున్నారు. అసోం రాష్ట్రం కూడా మా ప్రభుత్వ సహకారం కోరింది. ఎన్నికల సమయంలో IVRS కాల్స్ చేసి రైతులను భయపెట్టారు. మీ భూములు మీకు కాకుండా పోతాయని దుష్ప్రచారం చేశారు. భూముల రీ సర్వేపై చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు…? మా పని వల్ల కేంద్రం నుంచి రూ. 400 కోట్ల రాయితీ వచ్చింది. భూముల రీ సర్వేకు రూ. 6 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం” అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
{{/usCountry}}“భూసర్వేకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. 2020, డిసెంబర్ 9న సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. భూ సర్వే కోసం 3640 GNSS ఉపయోగించాం. నిజాలను ఎంతో కాలం తొక్కిపెట్టలేరు. భూముల రీ సర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కేరళ, ఉత్తరాఖండ్ అధికారులు సర్వేను అధ్యయనం చేశారు. మహారాష్ట్ర అధికారులు అధ్యయనం చేసి ప్రశంసించారు. సర్వేను .. అప్పటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మెచ్చుకున్నారు. అసోం రాష్ట్రం కూడా మా ప్రభుత్వ సహకారం కోరింది. ఎన్నికల సమయంలో IVRS కాల్స్ చేసి రైతులను భయపెట్టారు. మీ భూములు మీకు కాకుండా పోతాయని దుష్ప్రచారం చేశారు. భూముల రీ సర్వేపై చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు…? మా పని వల్ల కేంద్రం నుంచి రూ. 400 కోట్ల రాయితీ వచ్చింది. భూముల రీ సర్వేకు రూ. 6 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం” అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
{{/usCountry}}వైసీపీ హయాంలో ఇచ్చిన పాస్ బుక్ నే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. “యూనిక్ నెంబర్, క్యూఆర్ కోడ్ కూడా సేమ్ ఉంది. అన్నీ అవే ఉంచి.. పాస్ పుస్తకాల కలర్ మార్చి ఇస్తున్నారు. చంద్రబాబు చేసిందేమీ లేదు.. కొత్తగా రంగులు మార్చడం తప్ప.. ఇచ్చే చంద్రబాబు పాస్ పుస్తకాల్లో అన్నీ తప్పులు దొర్లుతున్నాయి. వైసీపీ హయాంలో పాతిన కొలత రాళ్లను కోట్లు ఖర్చు చేసి దానిపై ఉన్న పేర్లను చెరిపేస్తున్నారు” అని వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు.