15 వేల థియేటర్లలో ధురంధర్ రిలీజ్ అయుంటే- ఒక్క థియేటర్ లేని జిల్లాలు ఎన్నో ఉన్నాయని అమీర్ ఖాన్ ఆవేదన- చైనాతో పోటీ అంటూ!

భారతీయ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించాలంటే దేశంలో థియేటర్ల సంఖ్య భారీగా పెరగాలని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు. చైనాతో పోలిస్తే మన స్క్రీన్స్ చాలా తక్కువని, అదే మన ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని ఆయన విశ్లేషించారు. అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Feb 08, 2026 10:01 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతి పెద్దది. ఏడాదికి వందల సంఖ్యలో సినిమాలు ఇక్కడ నిర్మితమవుతాయి. కానీ, వసూళ్ల విషయానికి వస్తే మనం ఇంకా వెనుకబడే ఉన్నామన్నది చేదు నిజం. ఇదే విషయంపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా తన గళం విప్పారు. 'వెరైటీ ఇండియా' (Variety India)కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన భారతీయ సినిమా మార్కెట్ పరిధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

15 వేల థియేటర్లలో ధురంధర్ రిలీజ్ అయుంటే- ఒక్క థియేటర్ లేని జిల్లాలు ఎన్నో ఉన్నాయని అమీర్ ఖాన్ ఆవేదన- చైనాతో పోటీ అంటూ!
15 వేల థియేటర్లలో ధురంధర్ రిలీజ్ అయుంటే- ఒక్క థియేటర్ లేని జిల్లాలు ఎన్నో ఉన్నాయని అమీర్ ఖాన్ ఆవేదన- చైనాతో పోటీ అంటూ!

చైనాతో పోలిక.. మన పరిస్థితి ఇదీ!

భారతదేశంలో థియేటర్ల కొరత తీవ్రంగా ఉందని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. "ప్రస్తుతం మన దేశంలో కేవలం 9,000 స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అదే చైనాలో దాదాపు ఒక లక్ష స్క్రీన్స్ ఉన్నాయి. మనం వారితో పోల్చితే పదో వంతు కూడా లేము" అని అమీర్ ఖాన్ తెలిపారు.

"అందుకే చైనాలో ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు కేవలం ఆ ఒక్క దేశంలోనే 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,000 కోట్లకు పైగా) వసూళ్లను సాధిస్తోంది" అని అమీర్ ఖాన్ వివరించారు. థియేటర్ల సంఖ్య పెరిగినప్పుడే సినిమా వ్యాపారం అట్టడుగు స్థాయి (grassroots level) వరకు చేరుతుందని ఆయన స్పష్టం చేశారు.

'ధురందర్' మూవీతో విశ్లేషణ

గతేడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రణ్‌వీర్ సింగ్ చిత్రం 'ధురందర్' (Dhurandhar) ను అమీర్ ఖాన్ ఉదాహరణగా తీసుకుని విశ్లేషించారు. "ధురందర్ సుమారు రూ. 1,000 కోట్లు వసూలు చేసింది. ఒకవేళ ఈ సినిమా 5,000 స్క్రీన్లలో కాకుండా 15,000 స్క్రీన్లలో విడుదలయ్యి ఉంటే.. వసూళ్లు ఊహకందని స్థాయిలో ఉండేవి. ఇప్పటికీ మన దేశంలో ఒక్క సినిమా థియేటర్ కూడా లేని జిల్లాలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలి" అని అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

గతేడాది చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన 'నే ఝా 2' (Ne Zha 2) సుమారు 2 బిలియన్ డాలర్ల మార్కును దాటి ప్రపంచ రికార్డు సృష్టించగా, మన దేశంలో గతేడాది టాప్ గ్రాసర్ అయిన 'ధురందర్' ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 మిలియన్ డాలర్ల లోపే వసూలు చేసింది. స్క్రీన్ల సంఖ్యే ఈ భారీ వ్యత్యాసానికి కారణమని ఆయన విశ్లేషించారు.

మార్చిలో రానున్న 'ధురందర్: ది రివెంజ్'

ఇదిలా ఉంటే, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ గూఢచారి యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు తన సీక్వెల్‌కు సిద్ధమైంది. 'ధురందర్: ది రివెంజ్' పేరుతో వస్తున్న ఈ పార్ట్-2 మార్చి 19న విడుదల కానుంది.

ఇక అమీర్ ఖాన్ గత ఏడాది 'సితారే జమీన్ పర్' చిత్రంతో పలకరించారు. అది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం అమీర్ ఖాన్ పలు సినిమాల్లో అతిథి పాత్రలు చేస్తూనే, పూర్తిస్థాయి కథల కోసం వెతుకుతున్నారు.