Rakesh Bedi Get 1 Cr Bonus: సినిమా అంటే కేవలం హీరో, విలన్ మాత్రమే కాదు. బలమైన పాత్రలు పడితే ఏ నటుడైనా వెండితెరపై మ్యాజిక్ చేయగలడని బాలీవుడ్ నటుడు రాకేష్ బేడీ నిరూపించారు. 'ధురంధర్' చిత్రంలో ఆయన పోషించిన పాకిస్థానీ రాజకీయ నాయకుడు 'జమీల్ జమాలీ' పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
రాకేష్ బేడీ చెప్పిన డైలాగ్స్కు ఫిదా

ముఖ్యంగా రాకేష్ బేడీ చెప్పిన డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతున్నాయి. రెండో భాగం 'ధురంధర్: ది రివెంజ్'లో రాకేష్ బేడీ పాత్ర చుట్టూ తిరిగే ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేయడమే కాకుండా, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
ధురంధర్ సినిమాలు సాధించిన చారిత్రాత్మక విజయం, రాకేష్ బేడీ నటనకు వస్తున్న ప్రశంసలను చూసి నిర్మాతలు ఫిదా అయ్యారు. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు ఆదిత్య ధర్, నిర్మాత లోకేష్ ధర్ రాకేష్ బేడీకి రూ. 1 కోటి అదనపు పారితోషికాన్ని బోనస్గా అందజేసినట్లు సమాచారం.
పారితోషికానికి రెట్టింపు
నిజానికి ఈ ఫ్రాంచైజీకి (రెండు భాగాలకు కలిపి) రాకేష్ బేడీ గతంలో రూ. 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు రాకేష్ బేడీ నటనకు ప్రేక్షకులు ఫిదా కావడం, బ్రహ్మరథం పట్టడంతో ఆయనకు అదనంగా కోటి రూపాయలు ఇచ్చినట్లు టాక్ వస్తోంది. ఈ లెక్కన రాకేష్ బేడీ తీసుకున్న పారితోషికానికి ఇది రెట్టింపు అన్నమాట.
సాధారణంగా బాలీవుడ్లో హీరోలకు లాభాల్లో వాటాలు ఉండటం చూస్తుంటాం. కానీ, ఇలా ఒక సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కష్టాన్ని గుర్తించి ఇంత పెద్ద మొత్తంలో బోనస్ ఇవ్వడం చిత్ర పరిశ్రమలో అరుదైన విషయమని విశ్లేషకులు చెబుతున్నారు.
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ధురంధర్ సిరీస్లో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ రాకేష్ బేడీ తనదైన ముద్ర వేశారు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే, మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేయగా, రెండో భాగం కేవలం మూడు వారాల్లోనే రూ. 1700 కోట్ల మార్కును దాటేసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది.
తదుపరి ప్రాజెక్టులు
{{/usCountry}}ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ధురంధర్ సిరీస్లో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ రాకేష్ బేడీ తనదైన ముద్ర వేశారు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే, మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేయగా, రెండో భాగం కేవలం మూడు వారాల్లోనే రూ. 1700 కోట్ల మార్కును దాటేసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది.
తదుపరి ప్రాజెక్టులు
{{/usCountry}}ప్రస్తుతం రాకేష్ బేడీ చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. అందులో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వస్తున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' ఒకటి. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.