Sivaji OTT: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ మరోసారి ఓ పెద్ద చర్చకే తెరలేపారు. తాజాగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ఎపిక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆయన చేసిన కామెంట్స్ ఓటీటీ అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఓటీటీ అనేది కేవలం పనీపాటా లేని సోమరిపోతులకే అని ఆయన అనడం గమనార్హం. ఓటీటీల్లో సినిమాలు చూసేవాళ్లను ఉద్దేశించి శివాజీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఓటీటీ చూసేవాళ్లంతా సోమరిపోతులేనా?

సమయం ఎక్కువ ఉండి, ఖాళీగా ఇంట్లో పడుకోవడానికి ఇష్టపడేవాళ్లే ఓటీటీ వేదికలపై ఆధారపడుతున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. థియేటర్కు వచ్చి సినిమా చూసే అనుభూతి వేరని, దానికి డిజిటల్ ప్లాట్ఫామ్లు ఏమాత్రం సాటిరావని ఆయన స్పష్టం చేశారు.
ఇంట్లో కూర్చుని ఫోన్లలో, టీవీల్లో సినిమాలు చూడటం వల్ల నిజమైన సినిమా మ్యాజిక్ దెబ్బతింటోందని శివాజీ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఓటీటీ లవర్స్ నుంచి గట్టి కౌంటర్లు వస్తున్నాయి.
థియేటర్లో వస్తే 100 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేది
తన కంబ్యాక్ ప్రాజెక్ట్ '90s - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' (90's: A Middle Class Biopic) వెబ్ సిరీస్ గురించి కూడా శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సిరీస్ను నేరుగా ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మిడిల్ క్లాస్ ఎమోషన్స్తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ డిజిటల్ స్పేస్లో భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని బిగ్ స్క్రీన్పై విడుదల చేయకపోవడం పెద్ద మిస్టేక్ అని, థియేట్రికల్ పొటెన్షియల్ ఉన్న కంటెంట్ను ఓటీటీకి పరిమితం చేశారనే భావనను ఆయన వ్యక్తపరిచారు.
నిజానికి ఇప్పుడా వెబ్ సిరీస్ కు కొనసాగింపుగానే ఈ ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ వస్తోంది. ఆ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఓటీటీలో నవ్వులు పూయించిన ఆ డైరెక్టర్.. థియేటర్లలో ఏం చేస్తాడో చూడాలి.
సోషల్ మీడియాలో మొదలైన పెద్ద చర్చ
{{/usCountry}}నిజానికి ఇప్పుడా వెబ్ సిరీస్ కు కొనసాగింపుగానే ఈ ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ మూవీ వస్తోంది. ఆ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఓటీటీలో నవ్వులు పూయించిన ఆ డైరెక్టర్.. థియేటర్లలో ఏం చేస్తాడో చూడాలి.
సోషల్ మీడియాలో మొదలైన పెద్ద చర్చ
{{/usCountry}}శివాజీ కామెంట్స్పై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య భిన్నమైన వాదనలు నడుస్తున్నాయి. థియేటర్ వాతావరణం సాటిలేనిదనే విషయంలో శివాజీ వ్యాఖ్యలతో కొందరు ఏకీభవిస్తుండగా, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆయన మాటలను తప్పుబడుతున్నారు.
మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలు, స్నాక్స్ రేట్లు, పార్కింగ్ ఛార్జీలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం వల్లే ఫ్యామిలీస్ ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారని కామెంట్లు పెడుతున్నారు. వర్కింగ్ క్లాస్ ఆడియన్స్ను 'సోమరిపోతులు' అనడం సరికాదని, ఓటీటీ అనేది ఆధునిక కాలంలో సులభమైన ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ అని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.
ఆమధ్య హీరోయిన్ల బట్టల విషయంలోనూ పబ్లిగ్గా నోరు జారి పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్నారు శివాజీ. ఇప్పుడిక ఓటీటీల విషయంలోనూ అలాంటి ో చర్చకే తెరలేపారు.