...
...
Next Story

PM Modi: మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగుతా.. సీజేపీ వాళ్లు లోఫర్లు, ఎందుకూ పనికి రారు: బోర్డర్ నటుడి షాకింగ్ కామెంట్స్

PM Modi: బాలీవుడ్ నటుడు సుదేశ్ బెర్రీ పీఎం నరేంద్ర మోదీ, సీజేపీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మోదీని విష్ణు అవతారంగా వర్ణించిన అతడు.. సీజేపీలో అందరూ లోఫర్లే అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jul 30, 2026, 18:27:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

PM Modi: సన్నీ డియోల్ ఐకానిక్ వార్ మూవీ 'బోర్డర్' ఫేమ్ సీనియర్ బాలీవుడ్ నటుడు సుదేష్ బెర్రీ (Sudesh Berry) ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ప్రధాని మోదీని సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారంగా అభివర్ణించిన ఆయన, అవకాశం వస్తే మోదీ పాదాలు కడిగి ఆ నీళ్లను తాగడానికి కూడా వెనుకాడనని స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

"మోదీజీని దేవుడిలా గౌరవిస్తా".. సుదేష్ బెర్రీ కామెంట్స్

PM Modi: మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగుతా.. సీజేపీ వాళ్లందరూ లోఫర్లు, ఎందుకూ పనికి రారు: నటుడి షాకింగ్ కామెంట్స్ (Instagram)
PM Modi: మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగుతా.. సీజేపీ వాళ్లందరూ లోఫర్లు, ఎందుకూ పనికి రారు: నటుడి షాకింగ్ కామెంట్స్ (Instagram)

'అకంపనీ అక్కీ' (Accompany Akki) యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుదేష్ బెర్రీ.. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆకాశానికెత్తేశారు. గతంలో తాను సొంత తల్లి పాదాలు కడిగి గౌరవించుకున్నానని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

"నాకు మోదీజీతో వ్యక్తిగత పరిచయం లేదు, ఆయనను ఎప్పుడూ కలవలేదు. కానీ మనం దేవుడిని చూడకపోయినా ఎలా ఆరాధిస్తామో, నేను మోదీజీని అలాగే గౌరవిస్తాను. నాకు అవకాశం వస్తే ఆయన పాదాలు కడిగి ఆ నీళ్లు తాగుతాను" అని సుదేష్ బెర్రీ వ్యాఖ్యానించారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఒక మనిషిగా ఆయనకు ఇస్తున్న గౌరవమని పేర్కొన్నారు.

"జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే ఏం రాదు!"

ఈ ఇంటర్వ్యూలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్న సీజేపీ (Cockroach Janta Party) కార్యకర్తలపై సుదేష్ బెర్రీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి పార్టీల పేర్లు వినడానికే అసహ్యంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. సీజేపీలోని వాళ్లందరూ లోఫర్లు, ఎందుకూ పనికి రాని వారని అనడం గమనార్హం.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించిందని, దేశంలో ఇప్పటికే రామరాజ్యం మొదలైందని ఆయన అన్నారు. దీనిని కేవలం అనుభవపూర్వకంగానే తెలుసుకోగలమని, మాటల్లో చెప్పలేమని తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశ ప్రగతి కోసం అద్భుతంగా పనిచేస్తున్నారని సుదేష్ బెర్రీ కొనియాడారు.

'బోర్డర్' నుంచి బుల్లితెర వరకు సుదేష్ బెర్రీ ప్రస్థానం

1990ల కాలంలో బాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సుదేష్ బెర్రీ.. 1997లో వచ్చిన 'బోర్డర్' సినిమాలో సుబేదార్ మధురా సింగ్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బుల్లితెరపై 'మహాభారత్', 'శక్తిమాన్' వంటి ఐకానిక్ సీరియల్స్‌తో పాటు పలు హిందీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.

ఇప్పుడు రాజకీయ అంశాలపై, ప్రధాని మోదీపై ఆయన చేసిన బోల్డ్ కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe