Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'AA23' నుంచి ఒక ఊహించని న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ బిగ్ ప్రాజెక్ట్లో హీరోయిన్గా పూజా హెగ్డే నటించబోతుందంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. కానీ ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాలో అసలు హీరోయిన్ పాత్రకే స్థానం లేదని తెలుస్తోంది.

స్టోరీ లైన్ను ఏమాత్రం డైవర్ట్ చేయకుండా, పక్కా గ్రిప్పింగ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్లో మెయిన్ హీరోయిన్ రోల్ ఉండే అవకాశం దాదాపు లేదని సమాచారం.
పక్కా కథాధారిత సినిమా.. లోకేష్ మార్క్ రా స్టోరీ!
కథ చెప్పే తీరులోనే కాకుండా క్యారెక్టర్లను డిజైన్ చేయడంలోనూ లోకేష్ కనగరాజ్ రూటే సపరేటు. 'AA23' కోసం ఆయన సిద్ధం చేసిన స్క్రిప్ట్ పూర్తిగా స్టోరీ డ్రివెన్గా సాగుతుంది. అనవసరమైన పాటలు, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం హీరోయిన్ క్యారెక్టర్ను ఇరికించడం లోకేష్కి అస్సలు నచ్చదు. అందుకే ఈ సినిమాలో బలమైన ఫీమేల్ లీడ్ ఏమీ ఉండదని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
గతంలో కార్తీతో తీసిన కల్ట్ క్లాసిక్ 'ఖైదీ' (Kaithi), కమల్ హాసన్తో తీసిన రికార్డు బ్రేకింగ్ 'విక్రమ్' (Vikram) సినిమాల్లో కూడా హీరోయిన్ క్యారెక్టర్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. పూర్తిగా డార్క్, ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో బన్నీ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, లోకేష్ రా మేకింగ్ మాత్రమే మెయిన్ హైలైట్గా ఉండబోతున్నాయి.
పూజా హెగ్డే రూమర్లకు చెక్.. ఫ్యాన్స్కు క్లారిటీ!
మొదట్లో ఈ బిగ్ ప్రాజెక్ట్లో పూజా హెగ్డేను మెయిన్ హీరోయిన్గా తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. 'అల వైకుంఠపురములో' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ-పూజ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ కథ డిమాండ్ మేరకు హీరోయిన్ పాత్ర అవసరం లేదని లోకేష్ స్పష్టం చేయడంతో ఆ ప్రచారానికి ముగింపు పడింది.
{{/usCountry}}మొదట్లో ఈ బిగ్ ప్రాజెక్ట్లో పూజా హెగ్డేను మెయిన్ హీరోయిన్గా తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. 'అల వైకుంఠపురములో' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ-పూజ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ కథ డిమాండ్ మేరకు హీరోయిన్ పాత్ర అవసరం లేదని లోకేష్ స్పష్టం చేయడంతో ఆ ప్రచారానికి ముగింపు పడింది.
{{/usCountry}}హీరోయిన్ లేకపోయినా, కథలో ప్రతి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని టీమ్ చెప్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) వైబ్స్తో సాగే ఈ స్క్రిప్ట్లో ఆడియన్స్ను థ్రిల్ చేసే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని టాక్.
అట్లీ 'రాకా' ముగించి.. ఆగస్టు నుంచి 'AA23' సెట్స్లోకి!
ప్రస్తుతం అల్లు అర్జున్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీతో కలిసి 'రాకా' (Raaka) అనే భారీ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తుండగా, ఆమెకు సంబంధించిన కొన్ని కీలకమైన సీన్లను ఈ మధ్యే షూట్ చేశారు.
'రాకా' మూవీకి సంబంధించిన ప్రస్తుత షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న వెంటనే, అల్లు అర్జున్ ఆగస్టు నెల నుంచి 'AA23' సెట్స్లోకి అడుగుపెట్టనున్నారు. 'పుష్ప 2' లాంటి గ్లోబల్ విజువల్ వండర్ తర్వాత బన్నీ ఎంచుకుంటున్న ప్రాజెక్ట్లు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.