అల్లు అర్జున్, స్నేహారెడ్డిల ప్రేమబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్ళై 15 ఏళ్లు గడుస్తున్నా వీరిద్దరి మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా స్నేహారెడ్డి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒక ఆటో వెనుక తన భర్త పేరును చూసి ఆమె మురిసిపోయింది. ఎలాంటి క్యాప్షన్ లేకుండా ఆ ఫొటోను షేర్ చేసింది.
అల్లు అర్జున్ తాలూకా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన భర్త, పిల్లలకు సంబంధించిన క్యూట్ మూమెంట్స్ను ఫ్యాన్స్తో పంచుకుంటుంది. తాజాగా వాలెంటైన్స్ డే తర్వాత హైదరాబాద్ రోడ్లపై వెళ్తుండగా ఆమెకు ఒక ఆటో కనిపించింది. ఆ ఆటో వెనుక "ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాలూకా" అని ఇంగ్లిష్ అక్షరాల్లో రాసి ఉండటాన్ని ఆమె గమనించింది.
వెంటనే ఆ ఆటోను ఫోటో తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీనికి ఆమె ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకపోయినా, బన్నీ పట్ల అభిమానుల ప్రేమను చూసి ఆమె గర్వపడిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ "ఎంత ముచ్చటగా ఉంది", "వదినమ్మ ఫుల్ ఖుషీ" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. "నా భర్త.. నా భర్త అని చెప్పుకోవడంలో స్నేహారెడ్డి, సుప్రియా మీనన్ (పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య) మాత్రమే బెస్ట్" అని కొందరు సరదాగా పోస్టులు పెడుతున్నారు.
అల్లు కపుల్.. 15 ఏళ్ల ప్రయాణం
అల్లు అర్జున్, స్నేహారెడ్డి 2011 మార్చి 6న ఘనంగా వివాహం చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ తమ 15వ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోబోతున్నారు. వీరికి అయాన్ (2014), అర్హ (2016) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక ఫ్రెండ్ పెళ్లిలో కలుసుకున్న వీరిద్దరూ, కొన్నాళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
"నాది వన్ సైడ్ లవ్.."
{{/usCountry}}అల్లు అర్జున్, స్నేహారెడ్డి 2011 మార్చి 6న ఘనంగా వివాహం చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ తమ 15వ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోబోతున్నారు. వీరికి అయాన్ (2014), అర్హ (2016) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక ఫ్రెండ్ పెళ్లిలో కలుసుకున్న వీరిద్దరూ, కొన్నాళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
"నాది వన్ సైడ్ లవ్.."
{{/usCountry}}2024లో జరిగిన 'ఆర్య' 20 ఏళ్ల వేడుకలో బన్నీ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. తన వన్ సైడ్ లవ్ గురించి చెప్పమని అడిగినప్పుడు.. "నా లైఫ్ టైమ్ వన్ సైడ్ లవ్ స్నేహాతోనే (నవ్వుతూ). నేను ప్రేమించడమే తప్ప, అక్కడి నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండదు" అని స్నేహా ముందే బన్నీ జోక్ చేశాడు.
ఇక అల్లు అర్జున్ కెరీర్ చూస్తే.. 'పుష్ప: ది రూల్' సినిమాతో బన్నీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఈ సినిమా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం అతడు అట్లీ (Atlee) దర్శకత్వంలో రాబోయే భారీ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటించనుంది. జాన్వీ కపూర్ ను కూడా తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేయనున్నాడు.