Amitabh Bachchan: నేను మ్యాచ్ చూడలేదు.. అందుకే ఇండియా గెలిచింది: మెగాస్టార్ ట్వీట్ వైరల్

Amitabh Bachchan: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా విజయానికి ఓ వింత కారణం చెప్పాడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. తాను మ్యాచ్ చూడనందుకే ఇండియా గెలిచిందని చెప్పడం విశేషం. అతని ట్వీట్ వైరల్ అవుతోంది.

Published on: Mar 9, 2026, 13:38:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 8న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో మట్టికరిపించి, వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ అద్భుత విజయంపై సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. షారుక్ ఖాన్ నుండి అక్షయ్ కుమార్ వరకు బాలీవుడ్ తారలందరూ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు.

Amitabh Bachchan: నేను మ్యాచ్ చూడలేదు.. అందుకే ఇండియా గెలిచింది: మెగాస్టార్ ట్వీట్ వైరల్
Amitabh Bachchan: నేను మ్యాచ్ చూడలేదు.. అందుకే ఇండియా గెలిచింది: మెగాస్టార్ ట్వీట్ వైరల్

అమితాబ్ 'త్యాగం'.. వైరల్ అవుతున్న ట్వీట్

భారత్ గెలిచిన తర్వాత అర్ధరాత్రి 2 గంటల సమయంలో అమితాబ్ బచ్చన్ తన ఎక్స్ ఖాతాలో టీవీ స్క్రీన్ ఫోటోలను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. "నేను చూడకపోతే భారత్ గెలుస్తుందని ముందే చెప్పాను.. అలాగే జరిగింది!" అని హిందీలో రాసుకొచ్చాడు.

తాను లైవ్‌లో మ్యాచ్ చూస్తే టీమ్ ఇండియాకు కలిసిరాదనే ఒక రకమైన సెంటిమెంట్‌ను అతడు గతంలో కూడా చాలాసార్లు పంచుకున్నాడు. ఈ 'బ్యాడ్ లక్' సెంటిమెంట్ వల్లే తాను ఫైనల్ మ్యాచ్ చూడలేదని అతడు సరదాగా పేర్కొన్నాడు.

దీనిపై నెటిజన్లు కూడా అంతే సరదాగా స్పందిస్తున్నారు. "మీరు చేసిన త్యాగం గొప్పది సార్.. ఎప్పుడూ ఇలాగే చేయండి" అని ఒకరు కామెంట్ చేయగా, "నేను కూడా మీలాగే మ్యాచ్ చూడలేదు, అందుకే భారత్ గెలిచింది" అని మరొకరు రాశారు.

బాలీవుడ్ తారల శుభాకాంక్షలు

షారుక్ ఖాన్: "ఎంతటి అద్భుత విజయం! మెన్ ఇన్ బ్లూ అదరగొట్టారు. మిమ్మల్ని మైదానంలో చూస్తుంటే గర్వంగా ఉంది. జై హింద్!" అంటూ ప్రశంసించాడు.

అజయ్ దేవగన్: "అరిచి అరిచి గొంతు పోయింది, కానీ ముఖం మీద చిరునవ్వు మాత్రం వారం రోజుల వరకు తగ్గదు. కోట్ల మంది భారతీయుల గుండెలు గర్వంతో ఉప్పొంగేలా చేశారు" అని అన్నాడు.

అక్షయ్ కుమార్: తన రాబోయే సినిమా 'భూత్ బంగ్లా'లోని ఒక డ్యాన్స్ జిఫ్ (GIF)ను షేర్ చేస్తూ.. "ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి (పండుగ వాతావరణం). వరల్డ్ కప్ ఇంటికి తెచ్చినందుకు థాంక్స్" అని శుభాకాంక్షలు తెలిపాడు.

చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

ఈ విజయంతో భారత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట రాసుకుంది. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.

ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.

4 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా 'ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్'గా నిలవగా, టోర్నీ ఆద్యంతం రాణించి 321 పరుగులు చేసిన సంజూ శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More