నువ్వు ఎప్పుడూ స్టార్వే.. అహాన్ పాండే పుట్టినరోజున సయ్యారా కో-స్టార్ అనీత్
'సయ్యారా' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యంగ్ హీరో అహాన్ పాండే పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ఆయన సహనటి అనీత్ పడ్డా, అహాన్ లోని అసలైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్, 'సయ్యారా' హీరో అహాన్ పాండే నేడు తన 28వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తొలి సినిమాతోనే 'సూపర్ హిట్'ను తన ఖాతాలో వేసుకున్న ఈ కుర్ర హీరోపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, అహాన్ కి ఈ విజయం అకస్మాత్తుగా రాలేదని, ఆయన ఎప్పుడూ ఒక స్టార్ లానే ఉండేవాడని చెబుతున్నారు ఆయన కో-స్టార్ అనీత్ పద్దా.

"ప్రపంచానికి తెలియకముందే నేను చూశాను"
అహాన్ వ్యక్తిత్వాన్ని వివరిస్తూ అనీత్ రాసిన లేఖ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. "స్క్రీన్పై ప్రపంచం నిన్ను 'సయ్యారా'గా చూడటానికి ముందే.. నీలోని స్టార్ని నేను చూశాను. నువ్వు గట్టిగా నవ్వినప్పుడు చుట్టుపక్కల అపరిచితులు కూడా తెలియకుండానే నవ్వుతారు. నీ నోట్పాడ్లోని అద్భుతమైన ఆలోచనలు, సామాన్య విషయాల్లో కూడా అందాన్ని వెతికే నీ తపన.. నిన్ను ఒక అరుదైన వ్యక్తిగా నిలబెట్టాయి" అని అనీత్ పేర్కొన్నారు.
కేవలం నటుడే కాదు.. ఒక మంచి మనిషి
సినిమా హిట్టయి, స్టార్డమ్ వచ్చినప్పటికీ అహాన్ తన పాత అలవాట్లను మార్చుకోలేదని అనీత్ గుర్తుచేశారు. తన కోసం సెక్యూరిటీ గార్డ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆత్రుతగా ఎదురుచూస్తాడని, అపరిచితులతో కూడా అహాన్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారని ఆమె తెలిపారు.
అనీత్ తల్లిదండ్రులు కూడా అహాన్ను తమ సొంత కొడుకులా భావిస్తారని, అహాన్ తల్లి డీన్ పాండే తన కొడుకు సాధించిన విజయానికి, అతని మంచితనానికి గర్వపడుతున్నారని ఆమె వివరించారు.
'సయ్యారా' సినిమా అద్భుత విజయం సాధించిన తరుణంలో, అనీత్ చేసిన ఈ పోస్ట్ అహాన్ అభిమానులకు డబుల్ ట్రీట్ లా అనిపిస్తోంది. "నీలాంటి వ్యక్తిని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చినందుకు థన్యవాదాలు" అంటూ ఆమె తన శుభాకాంక్షలు తెలిపారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


