...
...
Next Story

Ashu Reddy: నా భర్తకంటే బెటర్‌గా ఉన్న‌వాడితో వ‌న్ నైట్ స్టాండ్‌-కోరిక‌లు చంపుకోలేను-ఎంగేజ్మెంట్ వేళ అషు పాత వీడియో వైరల్

Ashu Reddy: అషు రెడ్డి పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ ఎన్నారై యువకుడిని మోసం చేసిందనే కేసు విచారణలో ఉండగానే, ఎంగేజ్మెంట్ చేసుకున్నానని అషు షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్జీవీతో ఆమె పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది.

Published on: May 9, 2026, 15:27:22 IST
Advertisement

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్, నటి అషు రెడ్డి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ ఎన్నారై అబ్బాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందనే కేసులో అషు విచారణ ఎదుర్కుంటోంది. ఈ క్రమంలోనే ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్నానని పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అషు పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆర్జీవీతో అషు

అషు రెడ్డి (instagram)
అషు రెడ్డి (instagram)

అప్పట్లో ఆర్జీవీ, అషు బోల్డ్ ఇంటర్వ్యూ వీడియో ఒకటి సెన్సేషనల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఏకంగా అషు కాళ్లు నాకాడు. అయితే ఇప్పుడా ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఇందులో అషు కామెంట్లు కలకలం రేపుతున్నాయి.

భర్త కంటే మరో అబ్బాయి

ఈ ఇంటర్వ్యూలో అషు రెడ్డిని రామ్ గోపాల్ వర్మ వివిధ ప్రశ్నలు వేశాడు. ఈ క్రమంలో పెళ్లయిన తర్వాత భర్త కంటే మరో అబ్బాయి అట్రాక్టివ్ గా, సెక్సువల్ గా, బెటర్ గా కనిపిస్తే ఏం చేస్తావని అషును ఆర్జీవీ అడిగాడు.

‘‘నిజంగా చెప్పాలా? అలా అయితే అతనితో వన్ నైట్ స్టాండ్ (ఒక రాత్రి గడపడం) చేస్తా. ఎందుకంటే నా కోరికలను చంపుకోలేను కదా. చాలా మంది అమ్మాయిలు అలా చేయరు. కానీ నేను చేస్తా’’ అని అషు బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది.

అషు రెడ్డి కేసు

చీటింగ్ కేసు నేపథ్యంలో అషు రెడ్డి, ధర్మేంద్ర ఆడియో టేపులు లీక్ కావడం కూడా కలకలం రేపింది. అయితే కోర్టులో మాత్రం ఆయన ఇష్టప్రకారమే ఆ డబ్బు ఖర్చు చేశాడని, తిరిగి ఇవ్వలేనని అషు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అషు రెడ్డి ఎంగేజ్మెంట్ చేసుకుని షాకిచ్చింది.

తన ఎంగేజ్మెంట్ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో అషు పోస్టు చేసింది. కానీ ఆ పెళ్లి కొడుకు ఎవరన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు. అతని ముఖం కనిపించకుండా కేవలం చేతికి ఉన్న ఉంగరాల పిక్స్ మాత్రమే పోస్టు చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe